Next Crisis: ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఆవరించి వ్యాపారాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఇప్పుడు అందరి భయం రాబోయే ఆర్థిక సంక్షోభంపై ఉంది. దీనిపై ఇప్పటికే చాలా కాలంగా అనేక దేశాలు, నిపుణులు చర్చిస్తున్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విషయంలో తన హెచ్చరికను పునరుద్ఘాటించారు. క్రిప్టోలు ప్రపంచంలో మరో ఆర్థిక సంక్షోభానికి కారణంగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రిప్టోతోనే ప్రాబ్లమ్..
ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, రూల్స్ లేని క్రిప్టోలను నిషేధించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది సరైన అవగహన లేనప్పటికీ అనేక క్రిప్టో కాయిన్స్ లలో పెట్టుబడులు పెట్టి నష్టాలపాలు కావటం పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే తర్వాతి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నుంచి వస్తుందని, తన మాటలను పెడచెవిన పెట్టొద్దని నొక్కి చెప్పారు. క్రిప్టో కరెన్సీలు సెంట్రల్ బ్యాంకుల నియంత్రిత ప్రపంచాన్ని విశ్వసించరని.. వాటిని ఓడించాలనే కాంక్షతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

సాక్ష్యం కళ్ల ముందరే..
అమెరికాలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTX క్రాష్ను రాబోయే ఆర్థిక ముప్పుకు రుజువుగా రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. నవంబర్లో దివాళా తీయడానికి ముందు FTX 32 బిలియన్ డాలర్లు విలువైన క్రిప్టోకరెన్సీ క్రిప్టో ఎక్స్ఛేంజ్ గా ఉంది. దీనికి తోడు ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వాల్యుయేషన్ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.

బిట్ కాయిన్ పతనం..
గత సంవత్సరం ఒకానొక సమయంలో బిట్కాయిన్ అత్యధికంగా 60,000 డాలర్లకు చేరుకుంది. అయితే నవంబర్ 2021లో ఇది భారీ పతనాన్ని చూసింది. దీని ప్రపంచం మార్కెట్ విలువ గరిష్ఠ స్థాయి అయిన 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు తగ్గి ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పైగా ప్రైవేటు క్రిప్టో ఎక్స్ఛేంజీలకు ఆస్తులు లేకపోవటం చాలా ప్రమాదకరమని దాస్ అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో పరిస్థితి..
దాదాపుగా దశాబ్ధకాలం కిందట క్రిప్టోలు భారత్ లోకి ప్రవేశించినప్పటికీ వాటి పనితీరును రిజర్వు బ్యాంక్ తో పాు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తూనే ఉన్నాయి. ఇటీవల క్రిప్టోలను నియంత్రించాలని కేంద్రం నిర్ణయించటంతో వాటి ట్రాన్సాక్షన్లపై ఉక్కుపాదం మోపుతోంది. అధిక పన్నులతో పాటు ఇతర ఛార్జీలను విధిస్తోంది. "ప్రైవేట్ కరెన్సీల" ట్రేడింగ్ నుండి వచ్చే లాభాలపై 30% పన్ను ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడింది. దీంతో ఇండియాలో ఇన్వెస్టర్లు చాలా వరకు క్రిప్టోలకు దూరంగా జరుగుతున్నారు. 2018లో ఆర్బీఐ నిషేధం విధించగా 2020లో సుప్రీం కోర్టు ఆంక్షలను ఎత్తివేయటంతో అప్పట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేసి నష్టాలను మూటకట్టుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications