Paytm News: పేటీఎంపై తీవ్రంగా స్పందించిన ఆర్బీఐ గవర్నర్.. విజయ్ శేఖర్ శర్మ ఆశలు గల్లంతే

RBI News: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. తన పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారంపై రిజర్వ్ బ్యాంక్ పరిమితులు విధించిన అనంతరం ఉద్యోగులు జారిపోవడం నుంచి ఇద్దరు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నామని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని సంస్థ CEO విజయ్ శేఖర్ శర్మ భరోసా ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.

రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తర్వాత పేటీఎం వ్యవహారంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలను సెంట్రల్ బ్యాంక్ సమీక్షించబోదని తేల్చి చెప్పేశారు. ఆ బ్యాంకు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

RBI governer stringent answer on review about decision on paytm

'పేటీఎం విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి సమీక్ష ఉందదని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. అయితే కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్‌బీఐ నిబద్ధతతో పనిచేస్తుంది. ఫిన్‌టెక్ రంగానికి మద్దతును కొనసాగిస్తుంది' అని గవర్నర్ హామీ ఇచ్చారు. పేటీఎంకు సంబంధించి RBI తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సెట్‌ను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

నిరంతరం బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించడం మరియు మెటీరియల్ పర్యవేక్షణ ఆందోళనల కారణంగా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. కస్టమర్ ఖాతాలు, వాలెట్, ఫాస్ట్‌ట్యాగ్‌లు మరియు ఇతర సాధనాల్లో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించకుండా జనవరి 31న PPBLపై ఆర్బీఐ విధించిన నిషేధం ఫిబ్రవరి 29 తర్వాత అమల్లోకి రానుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+