Vegetable prices: విపరీతంగా పెరిగిపోతున్న ధరల కారణంగా సామాన్యుడి వంటగది వేడెక్కుతోంది. టమోటా, ఉల్లి సహా పలు ఆహార పదార్థాల రేట్లు ఎన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరాయి. పేద, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేని రేంజికి ఎగిసిపడుతూ వెక్కిరిస్తున్నాయి. వీటినుంచి ఎప్పుడు ఉపశమనం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ గుడ్ న్యూస్ చెప్పారు.
అతి త్వరలో కూరగాయల ధరలు తగ్గనున్నట్లు RBI గవర్నర్ వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి ఈ మార్పులు గమనించవచ్చని తెలిపారు. లలిత్ దోషీ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేయడం ఇప్పటికీ సవాలుగానే ఉందన్నారు. టమోటా కొత్త పంట మార్కెట్లోకి వస్తుండడంతో.. కీలకమైన ఇతర ఆహార ధరలు కూడా గణనీయంగా తగుముఖం పట్టినట్లు చెప్పారు.

పెరుగుతున్న తృణధాన్యాలు, కూరగాయల ధరల వల్ల గత నెలలో దేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతంగా నమోదు అయింది. మానిటరీ పాలసీ కమిటీ నిర్దేశిత లక్ష్యానికిపైగా కొనసాగడంపై RBI దీని కట్టడికి దృష్టి సారించినట్లు దాస్ వెల్లడించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తుచేశారు.
సామాన్యుడికి కొంత ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే నేపాల్ నుంచి టమోటాలు దిగుమతి చేసుకుంటోంది. రిటైల్ మార్కెట్లో వీటిని 50 చొప్పున విక్రయిస్తోంది. ఉల్లిపాయ బఫర్ స్టార్ కూడా 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 5కు పెంచింది. అందుబాటులో ఉన్న బఫర్ స్టాక్ నుంచి బహిరంగ మార్కెట్ కు విడుదల చేస్తోంది. వీటిని రిటైల్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్స్ ద్వారా కిలో 25 సబ్సిడీ రేటు తో వినియోగదారులకు అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications