Venkitaramanan: RBI మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ కన్నుమూత..!!
Venkitaramanan: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో గవర్నర్ గా పనిచేసిన ఎస్.వెంకటరమణన్ 92వ ఏట కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన అనారోగ్యంతో చెన్నైలో శనివారం కన్నుమూశారు.
వెంకటరమణన్ ట్రావెన్కోర్ సంస్థానంలో పద్మనాథపురం డివిజన్లో భాగమైన నాగర్కోయిల్లో తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. కేరళలోని యూనివర్శిటీ కాలేజ్ తిరువనంతపురం నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. తరువాత USలోని పిట్స్బర్గ్లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు.

వెంకటరమణన్ డిసెంబర్ 1990 నుంచి డిసెంబర్ 1992 వరకు రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా సేవలు అందించారు. అలాగే 1985-1989 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక కార్యదర్శిగా, కర్ణాటక ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిల్వలు వేగంగా క్షీణించడం వల్ల భారత చెల్లింపుల బ్యాలెన్స్ సంక్షోభాన్ని పరిష్కరించే సవాలును వెంకటరమణన్ ఎదుర్కొన్నారు.
తన నిర్ణయాత్మక చర్యలతో సంక్షోభం అంచున ఉన్న భారతదేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1989లో ఆర్థిక కార్యదర్శిగా దిగజారుతున్న భారత ఆర్థిక పరిస్థితిని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి బహుపాక్షిక సంస్థల నుంచి రుణాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రంలోని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
పదవీ విరమణ తర్వాత వెంకటరమణన్ అశోక్ లేలాండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఛైర్మన్గా కీలక పాత్రలు పోషించారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, SPIC, పిరమల్ హెల్త్కేర్తో సహా పలు కార్పొరేట్ బోర్డులకు సేవలు అందించారు.


Click it and Unblock the Notifications