Farm Loans: రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ రుణాలపై వడ్డీ రాయితీ.. పూర్తి వివరాలు..
RBI News: మోదీ 3.0లో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలని నిర్ణయించింది. జూలై 23న బడ్జెట్ ప్రసంగాన్ని గమనిస్తే అత్యధికంగా వ్యవసాయానానికి ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం రూ.3 లక్షల వరకు తీసుకున్న స్వల్పకాలిక రుణాల కోసం వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదించింది. స్కీమ్ కింద రైతులకు 7 శాతం వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది. సకాలంలో రుణం చెల్లించే రైతులకు ఏడాదికి 3 శాతం అదనపు వడ్డీ రాయితీ అందించబడుతుంది.

"పేర్కొన్న విధంగా సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే రైతులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి 4 శాతం చొప్పున స్వల్పకాలిక పంట రుణాలు, పశుపోషణ, పాడిపరిశ్రమ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వాటితో సహా అనుబంధ కార్యకలాపాలకు స్వల్పకాలిక రుణాలు అందుబాటులో ఉంటాయి" అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 2024-25కి రుణ సంస్థలకు వడ్డీ రాయితీ రేటు 1.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ఒక సర్క్యులర్ ద్వారా వెల్లడించింది.
రైతుల భయాందోళనలను తగ్గించటానికి, వారి ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వ చేయడానికి ప్రోత్సహించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వడ్డీ రాయితీ ప్రయోజనం పంటను పండించిన తర్వాత ఆరు నెలల వరకు పొడిగించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించేందుకు, ఆ సంవత్సరానికి వర్తించే వడ్డీ రాయితీ రేటును పునర్వ్యవస్థీకరించిన రుణ మొత్తంపై మొదటి సంవత్సరం బ్యాంకులకు అందుబాటులో ఉంచుతామని రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ రుణాలపై రెండవ సంవత్సరం నుంచి సాధారణ వడ్డీ రేటు వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications