Mahindra Finance: ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ కంపెనీలు లోన్స్ రికవరీ కోసం ఏర్పాటు చేసుకుంటున్న ఏజంట్లు యముడిలా మారుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా తమకు కావాల్సింది కేవలం డబ్బే అన్నట్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సంఘటన మహీంద్రా ఫైనాన్స్ కంపెనీలో జరగటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సైతం దీనిపై చాలా సీరియస్ అయింది.

సంచలన ఘటన..
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంపెనీ నియమించుకున్న లోన్ రికవరీ ఏజెంట్ చేసిన పని అందరితో కంటతడి పెట్టించింది. ఇప్పుడు దీనిపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది.
అసలు జరిగింది ఇది..
సుమారు వారం రోజుల కిందట హజారీబాగ్లో జరిగిన ఘటనపై మహీంద్రా గ్రూప్ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా బాధాకరంగా ఉందంటూ ట్వీట్ ద్వారా ప్రకటించారు. మిథిలేష్ మెహతా అనే రైతు మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకుని ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. అయితే అతడు సమయానికి వాయిదా చెల్లించలేక పోయాడు. వికలాంగుడైన రైతు నుంచి డబ్బు వసూలు కోసం వెళ్లిన థర్డ్ పార్టీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తించాడు. గర్భవతిగా రైతు కూతురిపై ట్రాక్టర్ ఎక్కించటంతో ఆమె మృతి చెందింది.

RBI హెచ్చరిక..
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఇకపై లోన్స్ రికవరీ కోసం ఔట్సోర్సింగ్ లేదా థర్డ్ పార్టీ రికవరీ ఎజెంట్లను వినియోగించటం పూర్తిగా మానేయాలని ఆదేశించింది. RBI ఆదేశాల మేరకు ఇకపై కంపెనీ బయటి వ్యక్తులను లోన్స్ రికవరీ కోసం వినియోగించదు.
అధికారిక ట్వీట్..
హజారీబాగ్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మహీంద్రా ఫైనాన్స్ సీఈవో అండ్ ఎండీ అనిష్ షా చేసిన ట్వీట్ను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ఈ విషయంపై థర్డ్ పార్టీ ఏజెంట్ల నుంచి రికవరీ పాలసీని సమీక్షించాలని ఆనంద్ మహీంద్రా కోరారు. విచారణలో పోలీసులకు సహకరిస్తానని కూడా హామీ ఇచ్చారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications