Mutual Funds: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సైతం పూర్తైంది. అయితే ఆ రోజు చెలరేగిన వివాదం ఇంకా ముగియలేదు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ఫిర్యాదులతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ వ్యవహారంపై తాజాగా RBI స్పందించింది.
UPI చెల్లింపుల వ్యవస్థలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లోపం వల్ల ఎటువంటి అంతరాయాలు నమోదు కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. ఆయా బ్యాంకుల వద్ద సాంకేతిక ఇబ్బందులు తలెత్తి ఉండవచ్చని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అందువల్లనే ఎలక్షన్స్ ఫలితాల రోజు మ్యూచువల్ ఫండ్స్ సరైన సమయానికి ఫండ్ హౌస్లకు క్రెడిట్ కాలేదని వెల్లడించారు.

మ్యూచువల్ ఫండ్స్ పేమెంట్స్లో UPI ఛానల్ ద్వారా జరిపిన చెల్లింపులను స్వీకరించడంలో అంతరాయం ఏర్పడినట్లు పలువురు కస్టమర్లు కంప్లైంట్ చేశారు. ఈ కారణంగా జూన్ 4న మార్కెట్లు కుప్పకూలిన రోజు క్రెడిట్ కావాల్సిన యూనిట్లు జూన్ 5వ తేదీ ఆధారంగా కేటాయింపు జరిగిందని ఫైర్ అయ్యారు. దీంతో భారీ స్థాయిలో తాము లాభాలను నష్టపోవాల్సి వచ్చినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో BSE నుంచి కూడా ఎటువంటి సమస్య లేదని ఎక్స్ఛేంజ్ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఇప్పుడు NPCI తరఫున RBI సమాధానం ఇచ్చింది.
ఇదే కాకుండా UPI సిస్టమ్స్ ద్వారా అంతరాయాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో RBI గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. అన్ని నియంత్రణ సంస్థలు ముందుగా నిర్ణయించిన లేదా అత్యవసర అంతరాయాలను నివేదించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై RBI దృష్టి సారించిన తర్వాత ఈ తరహా అంతరాయాలు 1 శాతం దిగువకు పడిపోయాయని ప్రకటించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications