Credit Score News: దేశంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, హైమార్క్ అనే నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఆర్బీఐ నుంచి క్రెడిట్ స్కోర్ అదించేందుకు ఆమోదాన్ని కలిగి ఉన్నాయి. సరైన క్రెడిట్ స్కోర్ మీరు వేగంగా రుణాలను పొందటానికి సహాయపడుతుంది. అలాగే చేసే కొన్ని తప్పులు క్రెడిట్ స్కోరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ క్రెడిట్ స్కోర్ విషయంలో ప్రవేశపెట్టిన కీలక నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1- ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై కస్టమర్ల క్రెడిట్ స్కోర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రెడిట్ బ్యూరో సంస్థలు అప్డేట్ చేస్తాయి. ఈ నియమం జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్ను వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఇది అమలులోకి రాగానే కస్టమర్ల క్రెడిట్ స్కోర్ను ప్రతి నెల 15వ తేదీ, నెల చివరిలో అప్డేట్ చేయవచ్చు.

2- దేశంలోని ఏదైనా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ కస్టమర్ క్రెడిట్ రిపోర్ట్ను తనిఖీ చేసినప్పుడల్లా.. సదరు కస్టమర్కు సమాచారాన్ని పంపడం అవసరమని రిజర్వు బ్యాంక్ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు చెప్పింది. ఈ సమాచారాన్ని SMS లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. క్రెడిట్ స్కోర్కు సంబంధించి అనేక ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
3- కొత్త నిబంధనల ప్రకారం కస్టమర్కు సంబంధించి ఏదైనా అభ్యర్థన తిరస్కరించబడితే.. దానికి కారణాన్ని వారికి తెలియజేయడం తప్పనిసరి. ఇది కస్టమర్ తన అభ్యర్థనను ఎందుకు తిరస్కరించబడిందో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అభ్యర్థనను తిరస్కరించడానికి కారణాల జాబితాను సిద్ధం చేయడం, అన్ని క్రెడిట్ సంస్థలకు పంపడం చాలా ముఖ్యం.
4- క్రెడిట్ కంపెనీలు సంవత్సరానికి ఒకసారి తమ కస్టమర్లకు పూర్తి క్రెడిట్ స్కోర్లను ఉచితంగా అందించాలి. ఇందుకు అవసరమైన క్రెడిట్ కంపెనీ తన వెబ్సైట్లో లింక్ను ప్రదర్శించవలసి ఉంటుంది. తద్వారా కస్టమర్లు తమ ఉచిత పూర్తి క్రెడిట్ నివేదికను సులభంగా తనిఖీ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
5- ఎవరైనా కస్టమర్ డిఫాల్ట్కు వెళితే.. దానిని నివేదించే ముందు కస్టమర్కు తెలియజేయడం ముఖ్యం. లోన్ మంజూరు చేసే సంస్థలు SMS/ఈ-మెయిల్ పంపడం ద్వారా మొత్తం సమాచారాన్ని పంచుకోవాలి. ఇవే కాకుండా బ్యాంకులు, రుణ వితరణ సంస్థలు నోడల్ అధికారులను నియమించాలి. క్రెడిట్ స్కోర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి నోడల్ అధికారులు కృషి చేస్తారని రిజర్వు బ్యాంక్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.
6- ఇకపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ 30 రోజుల్లోగా కస్టమర్ ఫిర్యాదును పరిష్కరించాల్సి ఉంటుంది. దీనిని గడువులోపు పూర్తి చేయకపోతే లేటైన ప్రతి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫిర్యాదు ఎంత ఆలస్యంగా పరిష్కారమైతే అంత ఎక్కువ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. సమస్య పరిష్కారానికి రుణం పంపిణీ చేసే సంస్థకు 21 రోజులు, క్రెడిట్ బ్యూరోకు తొమ్మిది రోజులు ఇందులో గడువు లభిస్తుంది. ఈ క్రమంలో 21 రోజుల్లోగా బ్యాంక్ క్రెడిట్ బ్యూరోకు తెలియజేయకపోతే బ్యాంక్ పరిహారం చెల్లిస్తుంది. బ్యాంకు నుంచి సమాచారం అందిన తొమ్మిది రోజుల తర్వాత కూడా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే క్రెడిట్ బ్యూరో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications