2000 Notes: రూ.2000 నోట్లు చెల్లుతాయా.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే..!
మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు మార్చి 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ 2023 మే 19న ప్రకటించారు. ఆ సమయంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఫిబ్రవరి 29, 2024న సమయానికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గింది ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
సెంట్రల్ బ్యాంక్ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా అధిక విలువ కలిగిన నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి మరియు/లేదా మార్చుకునే సదుపాయం అక్టోబర్ 07, 2023 వరకు దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్లలో అందుబాటులో ఉంది. అక్టోబరు 09, 2023 నుండి, ఆర్బిఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు / సంస్థల నుంచి రూ. 2,000 బ్యాంకు నోట్లను వారి బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయడానికి కూడా స్వీకరిస్తున్నాయని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంకా దేశంలోని ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచి అయినా, ఏదైనా RBI ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2,000 నోట్లను పంపుతున్నారని తెలిపింది. 2016లో రూ. 500, రూ. 1,000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాన్ని త్వరగా తీర్చడానికి ఆర్బిఐ నవంబర్ 2016లో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది.
ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరింది. దీంతో 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది. ఇక నుంచి రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని ఆర్బీఐ శుక్రవారం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications