రూ.100 కోట్ల ఎయిర్బస్ లగ్జరీ హెలికాప్టర్ కలిగిన ఫస్ట్ ఇండియన్
కేరళకు చెందిన ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బీ రవిపిళ్లై భారత్లోనే అత్యంత విలువైన ఎయిర్బస్ యజమానిగా నిలిచారు. దాదాపు రూ.100 కోట్ల విలువ కలిగిన ఎయిర్బస్ H145 హెలికాప్టర్ను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయుడు అయ్యారు. ఈ మేరకు ఎయిర్బస్ కేరళలోని కోవలంలో ఈ హెలికాప్టర్ను డెలివరీ చేసింది.
ఈ హెలికాప్టర్లో కోవలం నుండి రవిజ్ అష్టముడి వరకు ఆర్బీ గ్రూప్ వైస్ చైర్మన్తో కలిసి ప్రయాణించారు. ఈ హెలికాప్టర్ భారత్లో మొదటి ఎయిర్బస్ డీ3 హెలికాప్టర్. ఆసియాలో మొదటి ఫైవ్ బ్లేడ్ హెచ్145 హెలికాప్టర్. ఆర్పీ గ్రూప్కు కోజీకోడ్లోని ది రవిజ్ కొడవులో హెలిప్యాడ్ ఉంది. అలాగే, కొల్లంలో రవిజ్ అష్టముడి, తిరువనంతపురంలో రవిజ్ కోవలమ్ ఉంది.
ఈ హెలిక్యాప్టర్లో ఏడుగురు ప్రయాణించవచ్చు. ఇద్దరు పైలట్లకు సౌకర్యం ఉంది. సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో ల్యాండ్ అవుతుంది, టేకాఫ్ అవుతుంది. H145 ఎయిర్ బస్ ఫోర్ టన్ క్లాస్ ట్విన్ ఇంజిన్ రోటర్ క్రాఫ్ట్ ప్రోడక్ట్ రేంజ్. 68 ఏళ్ళ రవి పిళ్లై నెట్ వర్త్ 2.5 బిలియన్ డాలర్లు ఉంది. వివిధ కంపెనీలలో దాదాపు 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు.