Ratan Tata: భారత వ్యాపారవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించబడింది. ఆయన PM కేర్స్ ఫండ్ కొత్త ట్రస్టీగా నియమితులయ్యారు. రతన్ టాటాతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా పీఎం కేర్స్ ఫండ్కు ట్రస్టీలుగా నియమితులయ్యారు.

కొత్త సభ్యుల జాబితాలో..
దేశంలోని మరికొందరు పెద్ద వ్యక్తులు సలహా బృందంలో నామినేట్ చేయబడ్డారు. మాజీ కాగ్ రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి, ఇండికార్ప్స్, పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షాలను అడ్వైజరీ బోర్డుకు నామినేట్ అయ్యారు.

ప్రధాని అధ్యక్షతన..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇందులో కొత్తగా ఎన్నికైన సభ్యులు కూడా పాల్గొన్నారు. కొత్త ట్రస్టీలకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర ఉపశమనంగా 2020లో PM కేర్స్ ఫండ్ సృష్టించబడిందని మనందరికీ తెలుసు. ఈ నిధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛైర్మన్ గా ఉన్నారు.

రతన్ టాటా..
రతన్ టాటా వ్యక్తిత్వాన్ని చూస్తే.. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. సాధారణంగా నివసించే గొప్ప హృదయం కలిగిన ఉదారమైన వ్యక్తి. అనేక మందికి ఆయనే ప్రేరణ, ఆదర్శం. టాటా గ్రూప్ లోని చిన్న ఉద్యోగిని సైతం ఆయన తన కుటుంబంలో సభ్యుడిగా భావిస్తారు. సంపాదనలో అధిక భాగాన్ని విరాళాలుగా అందిస్తూ దేశంలో ప్రసిద్ధి చెందారు.

ప్రధాని మోదీ ఏమన్నారంటే..
PM CARESను న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ చట్టం- 1908 కింద మార్చి 27, 2020న ప్రారంభించారు. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యంతో, ఈ ఫండ్ సమగ్ర వీక్షణను పొందుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజా జీవితంలో తనకున్న అపార అనుభవం ఈ నిధిని వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత ఊపును ఇస్తుందని అన్నారు.

ఇందులో ఎన్ని కోట్లు ఉన్నాయంటే.
.
2020-21 ఆర్థిక సంవత్సరం ఆడిటెడ్ రిపోర్ట్స్ ప్రకారం పీఎం కేర్స్ ఫండ్ కు మెుత్తం రూ.10,990 కోట్లు విరాళంగా అందాయి. దీనిలో రూ.3,976 కోట్లు వివిధ అవసరాల కోసం ఖర్చుచేయబడింది. ఖర్చుచేసిన మెుత్తంలో వలసదారుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లకు పైగా, కొవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం రూ.1,392 కోట్లకు పైగా నిధులను వినియోగించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications