Trending Stock: దేశంలోని ప్రజలేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు ఎదురుచూస్తున్న కార్యక్రమం మరో రెండు రోజుల్లో జరగబోతోంది. అదే అయోధ్య ఆలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ. దీనికి సంబంధించిన అనేక కంపెనీల షేర్లు ఇప్పటికే భారీగా పెరుగుదలను నమోదు చేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పక్కా లిమిటెడ్ స్టాక్ గురించే. అయోధ్యకు చెందిన ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం మార్కెట్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. ఇప్పటికే సంస్థ రామ్ మందిర్ ట్రస్ట్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం. గురువారం కంపెనీ షేర్లు మార్కెట్లో 12 శాతం మేర లాభపడి రూ.323.75 వద్ద స్థిరపడ్డాయి. అలాగే ఇంట్రాడేలో గరిష్ఠ ధర రూ.334.40ను తాకింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ తన షేర్ హోల్డర్లకు 250 శాతానికి పైగా రాబడిని అందించింది.

వాస్తవానికి కంపెనీ పర్యావరణ హితమైన ప్లేట్లను తయారుచేసే వ్యాపారంలో ఉంది. ప్రస్తుతం శ్రీరాముని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంస్థ తయారు చేసిన ఎకో-ఫ్రెండ్లీ ఫుడ్ ప్లేట్లలో భక్తులకు ప్రసాదం అందించాలని ఆలయ బోర్డు నిర్ణయించింది. దీనిపై కంపెనీ ఇండియా బిజినెస్ హెడ్ హెడ్ జగ్దీప్ హీరా మాట్లాడుతూ.. కంపోస్టబుల్ టేబుల్వేర్కు ప్రసిద్ధి చెందిన తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ CHUKను రామ్ మందిర్ ట్రస్ట్ ఎంపిక చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ తమ ఉత్పత్తులను చెరకు పిప్పి నుంచి పర్యావరణ హితంగా తయారు చేస్తోంది.
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు రానున్నారు. రామమందిర్ ట్రస్ట్తో ఈ భాగస్వామ్యం ద్వారా ఆలయానికి కంపోస్టబుల్ టేబుల్వేర్ను అందజేస్తామని హీరా వెల్లడించారు. 2023 జనవరి 19న పక్కా లిమిటెడ్ స్టాక్ ధర కేవలం రూ.92.80గా ఉంది. కానీ నిన్నటి ధరను పరిశీలిస్తే 250 శాతం మేర పెరిగి రూ.323.75 వద్ద కొనసాగుతోంది.
గడచిన నాలుగేళ్ల కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు ఏకంగా 1507 శాతానికి పైగా రాబడిని అందించింది. అవును 2020 ఏప్రిల్ 3న స్టాక్ ధర కేవలం రూ.20.15 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో ఉన్న అనేక ఇతర కంపెనీలు సైతం ఇదే తరహాలో లాభాలను తమ పెట్టుబడిదారులకు అందిస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications