Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ నిర్మాణంతో రూ.4 లక్షల కోట్లు ఆదాయం..!

Ayodhya Tourism: అయోధ్యలోని రామమందిరం, ఇతర పర్యాటక ప్రణాళికల ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా రూ.20,000-25,000 కోట్ల పన్ను రాబడిని పెంచుకుంటుందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.

జనవరి 21న విడుదల చేసిన నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్థయాత్ర పునరుజ్జీవనం & ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్ (PRASHAD) పథకం కింద యూపీ పెద్ద లాభాన్ని పొందుతోందని వెల్లడైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ బడ్జెట్‌ ప్రకారం ఎఫ్‌వై24లో సొంత పన్నుల ఆదాయం రూ.2.5 లక్షల కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.

Ram Mandir and other tourism plans could boost Uttar Pradeshs finance

2022తో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో పర్యాటక వ్యయం రెట్టింపు అవుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. అయోధ్యలో రామమందిరాన్ని పూర్తి చేయడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి యూపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను బట్టి, యూపీలో పర్యాటకుల మొత్తం ఖర్చు రూ.4 లక్షల కోట్లు దాటవచ్చని తాము భావిస్తున్నట్లు వెల్లడించింది. 2022లో విదేశీయులు యూపీలో దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడైంది. 2022లో అయోధ్యకు 2.21 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.

ప్రస్తుతం యూపీలో రామ మందిరం నిర్మాణం తర్వాత పర్యాటక ప్రకృతి దృశ్యాన్ని మార్చివేసిందని రిపోర్ట్ పేర్కొంది. ఫలితంగా మెరుగైన భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు, యాక్సెస్ చేయగల కనెక్టివిటీని సులభతరమయ్యాయి. FY28 నాటికి దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడంతో ఉత్తరప్రదేశ్ 500 బిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో భారత జీడీపీలో యూపీ రెండవ అత్యధిక వెయిటేజీని కలిగి ఉంటుందని అంచనా వేయబడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+