కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు గతకొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. సోమవారం పసిడి ధరలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో సోమవారం (ఆగస్ట్ 3) టైటాన్ షేర్లు 3.26 శాతం ఎగిసి రూ.1,077 వద్ద ముగిశాయి. ఓ సమయంలో 4.4 శాతం పెరిగి రూ.1,089 చేరుకుంది. టైటాన్ ఇన్వెస్టర్లకు 4 శాతం డివిడెండ్ను ప్రకటించింది. కరోనా యంలో టైటాన్ సహా వివిధ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు భారీగా ఆదాయం వచ్చింది.

4 నెలల్లోరూ.1500 కోట్ల ఆదాయం
మార్చి 24వ తేదీన టైటాన్ రూ.720 కనిష్టం నుండి 50 శాతం ఎగిసింది. 2020లో టైటాన్ ఇప్పటి వరకు 9 శాతం క్షీణించింది. గత ఒక నెలలో 8 శాతం ఎగిసింది. ఒక్కో షేర్కు రూ.4 డివిడెండ్ ప్రకటించింది. జూన్ క్వార్టర్ ముగిసేనాటికి రాకేష్, ఆయన భార్య రేఖకు సంస్థలో 4.90 కోట్ల షేర్లు లేదా 5.53 శాతం వాటా ఉంది. టైటాన్ షేర్లు మార్చి కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు అతని పెట్టుబడుల వ్యాల్యూ రూ.3,528 కోట్లుగా ఉంది. గత శుక్రవారంతో ఇది రూ.5,112 కోట్లకు పెరిగింది. అంటే ఈ 4 నెలల కాలంలో రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చింది.

అంచనాలకు మించి రికవరీ.. మరింత వృద్ధి
జూన్ త్రైమాసికంలో ఆభరణాల విభాగంలో రికవరీ అంచనాలకు మించి ఉందని టైటాన్ తెలిపింది. ఇతర డిస్క్రిషనరీ స్పెండింగ్స్తో పోలిస్తే జ్యువెల్లరీ దిశగా ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. కరోనా అనంతరం బంగారాన్ని మరింత సురక్షిత పెట్టుబడిగా, ఆస్తిగా భావిస్తున్న వారు పెరుగుతున్నారని చెబుతున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేయడం, అంతర్జాతీయ హాలీడే ట్రావెల్స్ తగ్గుతాయని, ఇది జ్యువెల్లరీ డిమాండ్ పెంపుకు దోహద పడుతుందని టైటాన్ కంపెనీ ఎండీ సీకే వెంకటరామన్ అన్నారు. ప్రయాణాలు, పెళ్లిళ్లకు ఖర్చులు తగ్గడంతో జ్యువెల్లరీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారని, దీంతో రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్కు అనుగుణంగా
కరోనా నుండి పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత వినియోగంలో పెరుగుదలను చూడవచ్చునని, ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వాచీలు సహా వివిధ విభాగాల్లో వృద్ధి కనిపించిందని చెబుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా టైటాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గోల్డ్ కాయిన్, జ్యువెల్లరీకి డిమాండ్ ఉన్నప్పటికీ 2020లో పూర్తిస్థాయి డిమాండ్ రికవరీ అస్పష్టమేనని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications