8 ఏళ్ల తరువాత భారత గగనతలంలో అద్బుతం.. దేశ రాజధానికి చేరుకున్న తొలి ఆకాశ విమానం..
Akasa Air: ప్రముఖ పెట్టుబడిదారు, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్జున్వాలా, విమానయాన అనుభవజ్ఞులు వినయ్ దూబే, ఆదిత్య ఘోష్ల మద్దతుతో ఆకాశ ఎయిర్ తన వాణిజ్య విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆగస్టు 2021లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందింది. అయితే తాజాగా సంస్థకు చెందిన తొలి విమానం దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 72 బోయింగ్ 737 MAX విమానాల్లో మొదటిది డెలివరీ చేయబడింది. జూన్ 15, 2022న USAలోని సీటెల్లో ఎయిర్లైన్ విమానానికి సంబంధించిన సెరిమోనియల్ కీలను అందుకుంది.
ఆకాశ ఎయిర్ మొదటి ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ చేయడం వల్ల దేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ ని పొందేందుకు ఎయిర్లైన్స్ చేరువైందని చెప్పుకోవాలి. "మా మొదటి ఎయిర్క్రాఫ్ట్ రాక మనందరికీ చాలా సంతోషకరమైన క్షణం. ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారత్ లో అత్యంత విశ్వసనీయమైన, అత్యంత సరసమైన విమానయాన సంస్థను నిర్మించాలనే మా ఆలోచనను ఇది మమ్మల్ని మరింత చేరువ చేసింది", అంటూ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే తెలిపారు.
"Akasa Air ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ విమానయానం సాధించిన పురోగతికి ఒక ప్రధాన ఉదాహరణ. దేశం శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సాక్ష్యంగా ఉంది. ఇది మనకు, భారతీయ విమానయానానికి ఒక ముఖ్యమైన మైలురాయి మాత్రమే కాదు, ఇది ఒక కొత్త భారతదేశపు కథ" అని దూబే పేర్కొన్నారు. ఇదే క్రమంలో.. బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే మాట్లాడుతూ, "విమాన ప్రయాణాన్ని కలుపుకొని, అందరికీ అందుబాటులో ఉండేలా చేసే దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినందున ఆకాశ ఎయిర్తో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణం" అని అన్నారు. అధునాతన 737 MAX తన కస్టమర్లకు అత్యుత్తమ ఫ్లయింగ్ అనుభవాన్ని అందిస్తూనే వ్యాపార కార్యకలాపాల్లో అకాశ ఎయిర్ డ్రైవ్ సామర్థ్యాలకు సహాయపడుతుందని అన్నారు.