రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు పుల్లు డిమాండ్..లాటరీ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది త్వరపడండి..

Rajiv Swagruha Flats: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ టౌన్‌షిప్‌లలో నిల్వలో ఉన్న ఫ్లాట్లను భారీ స్థాయిలో అమ్మకానికి తెరలేపిన సంగతి విదితమే. బండ్లగూడ, పోచారం, గాజులరామారం ప్రాజెక్టులలోని వేల ఫ్లాట్లు, ప్లాట్‌లు ఇప్పుడు అమ్మకానికి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ ఫ్లాట్ల విక్రయాల ద్వారా ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. బండ్లగూడ, పోచారంలో తక్కువ ధరల ఇళ్ల విక్రయం ప్రారంభం కానున్నాయి.

నగరంలో మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకంలో నిర్మించిన ఫ్లాట్లను లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకు అందిస్తోంది. ఈ ఫ్లాట్ల విక్రయంపై హైదరాబాద్ నగరవాసుల్లో ఆసక్తి భారీగా పెరుగుతోందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి. భాస్కర్ రెడ్డి తెలిపారు.

Telangana Rajiv Swagruha Flats Sale Telangana Housing Scheme Rajiv Swagruha Project Telangana Real Estate News Rajiv Swagruha Flat Auction Telangana Government Housing Unsold Flats Telangana Rajiv Swagruha Mega Sale Telangana Revenue Boost Affordable Housing Telangana

బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని ఫ్లాట్లు మార్కెట్ ధరల కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని ఆయన చెబుతున్నారు.బండ్లగూడ (Nagole-Bandlaguda) లో 159 ఫ్లాట్లు, పోచారం (Pocharam)లో 601 ఫ్లాట్లు ఈ సారి మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల విక్రయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.బండ్లగూడ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 1200 మంది ప్రభుత్వ అధికారిక నంబర్ మీద ఫోన్‌లో సంప్రదించారు. ఇక 700 మంది ఈ ప్రాజెక్టును స్వయంగా సందర్శించారు. మరో ఏరియా పోచారం ఫ్లాట్లకు సంబంధించిన 800 మంది ప్రభుత్వానికి కాల్ చేసి విచారించారు. దాదాపు 300 మంది వరకు ఫ్లాట్లు ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు.

బండ్లగూడ ఫ్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ జూలై 29 వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీని లాటరీ జూలై 30న తీయనున్నారు. ఇక పోచారం ఇళ్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జూలై 31 వరకు ఉండగా లాటరీ ఆగస్టు 1న తీయనున్నారు. తక్కువ ధరలోనే సొంతింటి కలను నెరవేర్చుకునే ఈ అద్భుత అవకాశాన్ని మధ్యతరగతి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి. భాస్కర్ రెడ్డి కోరుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 2007లో ప్రారంభమైన రాజీవ్ స్వగృహ పథకం ఉద్దేశ్యం పట్టణాలు, నగర శివార్లలోని మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన గృహాలు అందించడం. అయితే గతంలో నిర్వహించిన ఆరు వేలం దశల్లో కూడా వందలాది ఫ్లాట్లు, వేల ప్లాట్‌లు అమ్ముడుకాలేదు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి మార్కెట్‌కు తీసుకురావడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతోంది.ఈ ఫ్లాట్లు సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రస్తుత అమ్మకానికి ఉన్న యూనిట్లు
పోచారంలొ సద్భావన టౌన్‌షిప్: 601 ఫ్లాట్లు
బండ్లగూడలో సహభావన టౌన్‌షిప్: 159 ఫ్లాట్లు
గాజులరామరం టవర్లు (9-14 అంతస్తులు, అసంపూర్తి యూనిట్లు సహా): 418 ఫ్లాట్లు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+