బెంగళూరు-మంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్: వచ్చే నెల నుంచే సరికొత్త రైలు ప్రయాణం!

బెంగళూరు (Bengaluru) నుండి మంగళూరు , కోస్తా కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంగళూరు-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు సర్వీస్ వచ్చే జూన్ నెలలోనే ప్రారంభం కాబోతోంది.

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న శనివారం మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హాసన్ , మంగళూరు మధ్య అత్యంత సవాలుతో కూడిన ఘాట్ సెక్షన్ రైల్వే మార్గంలో విద్యుద్దీకరణ (Electrification) పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఈ సెమీ హైస్పీడ్ రైలును పట్టాలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Railways Will Launch Mangaluru Bengaluru Vande Bharat Express Next Month Confirms Minister By 2026

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

దక్షిణ కన్నడ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా , ఇతర స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సరికొత్త రైలు సర్వీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈ కొత్త రైలు మంగళూరు సెంట్రల్ లేదా మంగళూరు జంక్షన్ స్టేషన్లను దాటవేస్తుందనే వస్తున్న పుకార్లను మంత్రి కొట్టిపారేశారు. కరెంట్ డిమాండ్‌ను బట్టి కోస్తా కర్ణాటకలోని అన్ని ముఖ్యమైన స్టేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని, భవిష్యత్తులో ఈ సర్వీసులను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే ప్లాన్ కూడా ఉందని స్పష్టం చేశారు.

కుక్కే సుబ్రహ్మణ్య భక్తులకు మెము (MEMU) బోనాంజా!

రైల్వే శాఖ వందే భారత్‌తో పాటు సాధారణ ప్రయాణికులు , భక్తుల కోసం మరికొన్ని కొత్త రైళ్లను కూడా అనౌన్స్ చేసింది..

  • మంగళూరు - కుక్కే సుబ్రహ్మణ్య: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మంగళూరు నుండి ప్రత్యేక 'మెము' (MEMU) రైలు సర్వీస్‌ను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ రైళ్లకు ఇది అదనం.
  • అరసికెరె - బెంగళూరు: వచ్చే వారమే అరసికెరె నుండి బెంగళూరు సిటీకి కొత్త మెము రైలు అందుబాటులోకి రానుంది.
  • ముంబై- బెంగళూరు: అలాగే ముంబై-మంగళూరు మధ్య నడిచే ప్రముఖ 'మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్' రైలుకు మంగళూరు జంక్షన్ స్టేషన్‌లో స్టాపింగ్ (హాల్ట్) కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
  • స్టేషన్ల మేకోవర్ ప్రాజెక్ట్: మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్‌ను రూ. 38 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆధునీకరిస్తున్నారు. ఈ పనులన్నీ అక్టోబర్ కల్లా పూర్తి కానున్నాయి. దీనితో పాటు రూ. 40 కోట్లతో జంక్షన్ యార్డ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మంగళూరు సెంట్రల్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా చివరి దశకు చేరింది.

మొత్తానికి, వచ్చే నెల నుండి ప్రారంభం కాబోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వల్ల బెంగళూరు (Bengaluru) , మంగళూరు మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు సరికొత్త లగ్జరీ అనుభూతి లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+