IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్: టికెట్ల బుకింగ్పై ఆ లిమిట్ పెంపు
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్న్యూస్ వినిపించింది. కోట్లాదిమంది ప్రయాణికులకు లబ్ది కలిగించే వార్త ఇది. రైళ్ల టికెట్లు బుకింగ్కు సంబంధించి కీలక సమాచారాన్ని అప్డేట్ చేసింది. రైలు టికెట్లు బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉన్న పరిమితి..6. అంటే ఆధార్ కార్డ్తో లింక్ లేని యూజర్ ఐడీ ద్వారా ప్రతినెలా ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే వీలు ఉండేది. ఈ పరిమితిని తాజాగా పెంచుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. 12 టికెట్ల వరకు బుక్ చేసుకునే వెసలుబాటును కల్పించింది.
ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ నుంచి ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న యూజర్ ఐడీ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడానికి ఇప్పుడున్న పరిమితి 12.. దీన్ని కూడా రెట్టింపు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్యను 24కు పెంచినట్లు వెల్లడించింది. వెరిఫైడ్ ఆధార్ కార్డ్ లింక్ ఉన్న యూజర్ ఐడీ ద్వారా ప్రతినెలా 24 టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది.
ఐఆర్సీటీసీలో రిజిస్టర్ అయిన యూజర్ ఐడీ వినియోగదారులు మై ప్రొఫైల్ ద్వారా తమ ఆధార్ కార్డ్ వివరాలు, కేవైసీని అప్డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్కు ఓటీపీని పొందుపరచడం ద్వారా ఆధార్ కార్డ్తో ఐఆర్సీటీసీ వెబ్సైట్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. దీనికోసం ఆధార్ కార్డ్లో పొందుపరిచిన మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ ఒకటే అయివుండాలి.
ఆధార్ కార్డ్ను యూజర్ ఐడీతో లింక్ చేసుకునే వారు ఇకపై ప్రతినెలా 24 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ లేని వారు 12 టికెట్లు మాత్రమే ప్రతినెలా బుక్ చేసుకోగలుగుతారు. ఇదే విధానం ఐఆర్సీటీసీ యాప్కు కూడా వర్తిస్తుంది.