Buzzing Stock: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో రైల్వే కంపెనీల షేర్లలో బూమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వాటిలో భారీ పెరుగుదల కనిపించింది. దాదాపు మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఇదే కొనసాగుతోంది.
స్మాల్క్యాప్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ షేరు గత శుక్రవారం 8 శాతానికి పైగా పెరిగి రూ.378కి చేరుకుంది. వారాంతంలో రైల్టెల్ కంపెనీ మరో ఆర్డర్ను అందుకుందనే వార్త షేర్లలో మహా ర్యాలీకి దారితీసింది. గత 7 రోజుల్లో కంపెనీకి 3 పెద్ద ఆర్డర్లు వచ్చిన వేళ రైల్టెల్ షేర్లు 20% కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయి. మార్చి 13, 2024న కంపెనీ షేర్లు రూ.308.40 వద్ద ఉండగా నేడు ఇంట్రాడేలో రూ.378 రేటుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.491.15గా ఉన్నాయి.

కంపెనీ అందుకున్న ఆర్డర్లను పరిశీలిస్తే.. గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వర్క్ ఆర్డర్ అందిందని రైల్ టెల్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఈ ఉత్తర్వు BMC ఆరోగ్య విభాగానికి సంబంధించినది. ఈ క్రమంలో కంపెనీ HMIS సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమీషన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ వంటి పనులను చేయాల్సి ఉంటుంది.
ఈ ఆర్డర్ మొత్తం విలువ రూ.351.95 కోట్ల విలువైనది. ఇదే క్రమంలో శనివారం రైల్టెల్ రూ.130 కోట్ల విలువైన మరో ఆర్డర్ను అందుకుంది. బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి ఈ ఉత్తర్వు అందింది. కంపెనీ దీనికి ముందు ఒరిస్సాలో రెండు ఆర్డర్లను అందుకుంది. ఈ ఆర్డర్ల విలువ వరుసగా రూ.114 కోట్లు, రూ.87 కోట్లని తెలుస్తోంది.
వరుస ఆర్డర్లతో పాటు రైల్వే షేర్లలో గతంలో కొనసాగిన బూమ్ కారణంగా.. రైల్టెల్ కార్పొరేషన్ షేర్లు గత ఏడాది కాలంలో 260% కంటే ఎక్కువ పెరిగాయి. మార్చి 20,2023న కంపెనీ షేర్లు రూ.102.20 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. 18 మార్చి 2024న రైల్టెల్ షేర్లు రూ.378కి చేరుకున్నాయి. అలాగే గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 70 శాతానికి పైగా పెరిగాయి. RailTel స్టాక్ 18 మార్చి 2024న రూ.378కి చేరింది. కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.96.20గా ఉంది.


Click it and Unblock the Notifications