Buzzing Stock: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో రైల్వే కంపెనీల షేర్లలో బూమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వాటిలో భారీ పెరుగుదల కనిపించింది. దాదాపు మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఇదే కొనసాగుతోంది.
స్మాల్క్యాప్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ షేరు గత శుక్రవారం 8 శాతానికి పైగా పెరిగి రూ.378కి చేరుకుంది. వారాంతంలో రైల్టెల్ కంపెనీ మరో ఆర్డర్ను అందుకుందనే వార్త షేర్లలో మహా ర్యాలీకి దారితీసింది. గత 7 రోజుల్లో కంపెనీకి 3 పెద్ద ఆర్డర్లు వచ్చిన వేళ రైల్టెల్ షేర్లు 20% కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయి. మార్చి 13, 2024న కంపెనీ షేర్లు రూ.308.40 వద్ద ఉండగా నేడు ఇంట్రాడేలో రూ.378 రేటుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.491.15గా ఉన్నాయి.

కంపెనీ అందుకున్న ఆర్డర్లను పరిశీలిస్తే.. గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వర్క్ ఆర్డర్ అందిందని రైల్ టెల్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఈ ఉత్తర్వు BMC ఆరోగ్య విభాగానికి సంబంధించినది. ఈ క్రమంలో కంపెనీ HMIS సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమీషన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ వంటి పనులను చేయాల్సి ఉంటుంది.
ఈ ఆర్డర్ మొత్తం విలువ రూ.351.95 కోట్ల విలువైనది. ఇదే క్రమంలో శనివారం రైల్టెల్ రూ.130 కోట్ల విలువైన మరో ఆర్డర్ను అందుకుంది. బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి ఈ ఉత్తర్వు అందింది. కంపెనీ దీనికి ముందు ఒరిస్సాలో రెండు ఆర్డర్లను అందుకుంది. ఈ ఆర్డర్ల విలువ వరుసగా రూ.114 కోట్లు, రూ.87 కోట్లని తెలుస్తోంది.
వరుస ఆర్డర్లతో పాటు రైల్వే షేర్లలో గతంలో కొనసాగిన బూమ్ కారణంగా.. రైల్టెల్ కార్పొరేషన్ షేర్లు గత ఏడాది కాలంలో 260% కంటే ఎక్కువ పెరిగాయి. మార్చి 20,2023న కంపెనీ షేర్లు రూ.102.20 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. 18 మార్చి 2024న రైల్టెల్ షేర్లు రూ.378కి చేరుకున్నాయి. అలాగే గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 70 శాతానికి పైగా పెరిగాయి. RailTel స్టాక్ 18 మార్చి 2024న రూ.378కి చేరింది. కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.96.20గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications