Uber Green: గ్లోబల్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ ఉబెర్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది.'ఉబెర్ గ్రీన్' పేరుతో జూన్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో సహా మూడు నగరాల్లో EV క్యాబ్లను బుకింగ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
భారతదేశంలో వేగంగా విద్యుత్ వాహనాల వినియోగం వైపు ప్రజలు మెుగ్గుచూపుతున్న తరుణంలో ఉబెర్ తాజా వ్యాపార ప్రణాళికను తెరమీదకు తీసుకొచ్చింది. దీనికోసం కంపెనీ 25,000 నాలుగు చక్రాల వాహనాలతో పాటు 10 వేల ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. దీనిని కార్యరూపంలోకి తెచ్చేందుకు US-ఆధారిత సంస్థ EV ఫైనాన్సింగ్, EV ఛార్జింగ్ అవస్థాపనను అందించడం, మరెన్నో రంగాలలో వివిధ కంపెనీలతో భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

దీనికోసం కంపెనీ లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు గురుగ్రామ్కు చెందిన జిప్ ఎలక్ట్రిక్తో దాని ద్విచక్ర వాహన సముదాయం కోసం భాగస్వామ్యం కూడా కలిగి ఉంది. NASDAQ-లిస్టెడ్ కంపెనీ వరుసగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్సింగ్ కోసం Jio-BP, GMR గ్రీన్ ఎనర్జీ, SIDBIతో జతకట్టింది. 2040 నాటికి పూర్తిగా విద్యుత్ వాహనాలతో రైడ్ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఉబెర్లోని మొబిలిటీ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ మెక్డొనాల్డ్ పేర్కొన్నారు.

గ్రీన్ మెుబిలిటీ ద్వారా వాతావరణ మార్పులు, కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఈ చర్యలు దోహదపడతాయని ఆండ్రూ వెల్లడించారు. అయితే పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మారటం సవాలుతో కూడుకున్నదని ఉబెర్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ అన్నారు. అలాగే EVలకు మారే ఆర్థిక భారం డ్రైవర్లపై పడకూడదని అభిప్రాయపడ్డారు. అలాగే భారతదేశ రైడ్-షేరింగ్ పరిశ్రమలో డ్రైవర్లు ఎలక్ట్రిక్ వేగంగా, సూపర్ఛార్జ్ స్థిరమైన పరివర్తనకు పరిశ్రమ భాగస్వాములతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications