Rahul Gandhi: గ్యాప్ దొరికినప్పుడల్లా కాంగ్రెన్ నేత రాహుల్ గాంధీ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఏకంగా మోదీ-అదానీ సంబంధాలపై లోక్ సభలోనే ప్రశ్నించి ఎండగట్టారు.
తాజాగా దేశంలో బొగ్గు ధరల వ్యవహారంపై రాహుల్ స్పందించారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అధిక డిమాండ్ తీర్చేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను చాలా సంస్థలు తిరిగి వినియోగంలోకి తెచ్చాయి. దీంతో విదేశాల నుంచి అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్వాయిస్ చేసి ప్రజల సొమ్మును రూ.12,000 కోట్లను లాక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించి ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవలి నివేదికను రాహుల్ ఉదహరించారు. అదానీ విషయంలో విచారణ ప్రారంభించి, ప్రధాని నరేంద్ర మోదీ తన విశ్వసనీయతను కాపాడుకోవాలన్నారు. ఈ అంశంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కంటే చాలా ఎక్కువ ధరలకు బిలియన్ డాలర్ల బొగ్గును దిగుమతి చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపణలు ప్రస్తుతం దావానలంగా వ్యాపిస్తున్నాయి. ఓవర్ ఇన్వాయిస్ చేసి అదానీ రూ.12,000 కోట్లను ప్రజల జేబుల నుంచి కాజేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇండోనేషియాలో బొగ్గు కొని దానిని ఇండియాకు తీసుకొస్తుంటే ధర రెండింతలౌతోందని నివేదికలను ఉదహరిస్తూ వెల్లడించారు. ఇలా ఓవర్ ఇన్ వాయిసింగ్ వల్ల దేశంలో విద్యుత్ ధరలపై ప్రభావం పడి అంతిమంగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అదానీకి ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉందని, అతని వెనుక ఎవరు ఉన్నారనే విషయం దేశంలోని ప్రజలందరికీ తెలుసరి రాహుల్ వ్యాఖ్యానించారు. ఈసారి దొంగతనం ప్రజల జేబుల నుంచి జరుగుతోందని.. ప్రజలు స్విచ్ నొక్కితే డబ్బు అదానీ జేబులో పడుతోందంటూ విమర్శించారు. అయితే ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల విషయంలో దర్యాప్తు ఎదుర్కొంటోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications