పాకిస్తాన్‌తో పోటీ పడతారెందుకు? చైనాతో తలపడండి, రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ప్రపంచంలోనే అత్యున్నత శక్తిగా ఎదగాలని RBI మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ ఆకాక్షించారు. అయితే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌తో మనం పోటీ పడకూడదు. మన పోటీ అంతా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాతోనే ఉండాలని పిలుపునిచ్చారు. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 7.4%.. అలాగే పూర్తి సంవత్సరానికి 6.5% బలమైన GDP వృద్ది గురించి రఘురామ్ రాజన్ మాట్లాడారు.

ఇది భారతదేశానికి సరైన సమయమని మనం దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం భారతదేశ వృద్ధి రేటు బాగుంది, అయితే ఇది మనకు సరిపోదు. దీని కన్నా మనకు ఇంకా ఎక్కువ అవసరం. 2027 నాటికి అభివృద్ధి చెందిన ఇండియాగా మారడానికి మనకు 8%-9% వృద్ధి అవసరం అని నొక్కి చెప్పారు. ఎందుకంటే మన దేశం సాపేక్షంగా పేద దేశం అని అన్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.. ఇటీవల ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరంగా 6.5 శాతం వృద్ధి చెందింది.

Raghuram Rajan India China Pakistan India vs China comparison India Pakistan global image Raghuram Rajan economic advice India global positioning India should not be clubbed with Pakistan India China competition Rajan on India s future India geopolitical comparison ex RBI governor Rajan news India China Pakistan strategy

NSO యొక్క రెండవ ముందస్తు అంచనాల ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ 2024-25లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం GDP వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. 2023-24లో భారతదేశ GDP ఆకట్టుకునే 9.2 శాతం పెరిగింది, ఇది వరుసగా 100 శాతం వృద్ధి రేటును సూచిస్తుంది.

పాకిస్తాన్ తో వివాదం గురించి రఘురామ్ రాజన్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ స్థిరత్వం గురించి ప్రశ్నలను లేవనెత్తింది. అదే సమయంలో, ఒక విధంగా అది మనల్ని మనమే క్యూలో పెట్టుకున్నట్లు అయింది. మనం దీన్ని నివారించాలి ఎందుకంటే మనం మనల్ని ఇంకా బాగా ధృఢంగా మలుచుకోవాలి. మనం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని రఘురామ్ రాజన్ అన్నారు.

మనం ఆర్థిక వ్యవస్థలో పాకిస్తాన్ కు కాకుండా చైనాకు పోటీదారుగా మారాలి. పాకిస్తాన్ తో మనల్ని ఒక క్లబ్ గా ఉంచడం కంటే ఇండియా-చైనా క్లబ్ ఉండటం మంచిది. అప్పుడు మన స్థానం ప్రజల మనస్సులలో అగ్రభాగానికి చేరుకుంటుందని తెలిపారు. ప్రజలు పెట్టుబడి పెట్టడానికి స్థలాల కోసం చూస్తున్నారని, భారతదేశానికి చాలా విషయాలు సరిగ్గా జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఇందులో పెద్ద దేశీయ మార్కెట్ కూడా ఉంది. మనం పని చేయాల్సిన రంగాలు చాలానే ఉన్నాయి. మన విశ్వవిద్యాలయాల నాణ్యతను మెరుగుపరచాలనుకుంటే, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్ఛపై కూడా దృష్టి పెట్టవచ్చని రఘురామ్ రాజన్ అన్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+