Bank of Baroda: ఎస్‌బీఐని తలదన్నే స్థాయికి బ్యాంక్ ఆఫ్ బరోడా.. వామ్మో రూ.లక్ష కోట్లు..

Bank of Baroda: మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకదానితో మరొకదానిని కలిపేసిన తర్వాత వారి ఆదాయాల్లో భారీ మార్పు కనిపించింది. అదే సమయంలో వాటి ఉమ్మది మార్కెట్ విలువ సైతం విపరీతంగా పెరిగింది.

డిజిటలైజేషన్ కారణంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సైతం బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యంత విలువైన కంపెనీగా ఉండేది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం అదే మార్గంలో వేగంగా వృద్ధి చెందుతోంది. మార్కెట్ క్యాప్ ప్రకారం ఈ రెండు ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులుగా అవతరించాయి.

Public sector bank of baroda market cap crossed one lakh crores after SBI

సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్ల మార్కును దాటింది. ఎస్‌బీఐ తర్వాత ఆ మార్కును అందుకున్న తొలి ప్రభుత్వ బ్యాంకుగా సంస్థ ఘనత సాధించింది. అయితే ప్రస్తుతం ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.5.07 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన సంస్థగా నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో TCS, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, ITC, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, భారతీ ఎయిర్‌టెల్ నిలిచాయి.

ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ ధర క్రితం సెషన్‌తో పోల్చితే 3 శాతం పెరిగి రూ.193.75 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాలను బుక్ చేసుకోవడంతో దేశీయ సూచీలు రికార్డు స్థాయిలను తాకలేకపోయాయి. గత వారం.. టాప్-10 అత్యంత విలువైన దేశీయ సంస్థల్లో ఆరు సంస్థలు మార్కెట్ విలువకు రూ.1,13,703.82 కోట్లను జోడించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+