IPO News: దీపావళి తర్వాత పేలిన ఐపీవో.. తొలిరోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట..
Protean eGov Technologies: దీపావళి తర్వాత రోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన Protean eGov టెక్నాలజీస్ ఐపీవో ఇన్వెస్టర్లను సంతోషంలోకి నెట్టింది. మెుదటి రోజు ఫ్లాట్ లిస్టింగ్ తర్వాత మంచి రాబడులను అందించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈరోజు మార్కెట్లో జాబితా చేయబడిన ఐపీవో ముందుగా ప్లాట్ లిస్టింగ్ నమోదు చేసింది. బీఎస్ఈలో షేర్ ధర రూ.792 వద్ద లిస్టైంది. అయితే లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించింది. స్టాక్ ధర 3.91 శాతం పెరుగుదలతో ఇంట్రా-డే గరిష్ట స్థాయి రూ.823కి చేరుకుంది. వాస్తవానికి మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఐపీవో మెరుగైన పనితీరును కనబరిచిందని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.

ఐపీవో కోసం Protean eGov టెక్నాలజీస్ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.752 నుంచి రూ.792గా నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.490.33 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 62 లక్షల షేర్లను విక్రయించింది. కంపెనీ ఐపీవో లాట్ పరిమాణాన్ని 18 షేర్లుగా నిర్ణయించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,256 లాట్ కొనుగోలు కోసం వెచ్చించాల్సి వచ్చింది.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.143.53 కోట్లను సమీకరించింది. అలాగే కంపెనీ తన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.75 డిస్కౌంట్ రేటుకు షేర్లను రిజర్వు చేసి అందించింది. మూడు రోజుల సబ్స్క్రిప్షన్ సమయంలో 28 సార్లు ఐపీవో ఓవర్ సబ్స్క్రైబ్ చేయబడింది. మొదటి రోజు 1.08 సార్లు, రెండవ రోజు 3.22 సార్లు, మూడవ రోజు 23.86 సార్లు సభ్యత్వం పొందింది. చివరి రోజున QIB విభాగంలో 46.94 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది.


Click it and Unblock the Notifications