భారతదేశంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత ఊపునిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగ వైమానిక దళ హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ నిర్మితం కానుంది. యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్బస్ అండ్ టాటా గ్రూప్ చెందిన ఏరోస్పేస్ విభాగం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) కలిసి ఈ యూనిట్ను ఏర్పాటు చేయనున్నాయి. అయితే భారత వైమానిక దళం (IAF) కోసం H125 హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఇక్కడే ఏర్పాటు చేయబడుతుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఇది ఏరోస్పేస్ తయారీలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మేక్ ఇన్ ఇండియా లక్ష్యం: ఈ కొత్త యూనిట్ ఎయిర్బస్ బెస్ట్ సెల్లింగ్ సివిల్ కేటగిరీ H125 హెలికాప్టర్ను తయారు చేస్తుంది. ఫ్రాన్స్, అమెరికా ఇంకా బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో ఇది నాల్గవ ప్లాంట్ అవుతుంది. ప్రారంభంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 హెలికాప్టర్లతో పనిచేస్తుంది. అయితే, రాబోయే 20 సంవత్సరాలలో భారతదేశం అలాగే దక్షిణాసియాలో 500 తేలికపాటి హెలికాప్టర్లకు డిమాండ్ ఉంటుందని ఎయిర్బస్ అంచనా వేస్తున్నందున, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని మరింతగా విస్తరించనున్నారు.
భారీ పెట్టుబడులు: ఈ ప్లాంట్ బెంగళూరుకు రెండు గంటల దూరంలో ఉన్న వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మించబడుతుంది. ఇక్కడ TASL ఇప్పటికే ఉపగ్రహ తయారీ యూనిట్తో సహా ఇతర ప్లాంట్లు ఉన్నాయి. టాటా ఇటీవల వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 7.4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడే విమానాల తయారీ, అసెంబ్లీ ఇంకా MRO (నిర్వహణ, మరమ్మత్తు అలాగే ఓవర్హాల్) సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి.
కొత్త ఉపాధి అవకాశాలు: ఈ చొరవ దేశ స్వదేశీ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు అధునాతన పారిశ్రామిక గ్రూపుల అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అక్యూస్ ఛైర్మన్ అండ్ CEO అరవింద్ మెల్లిగేరి అన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు నైపుణ్యాల అభివృద్ధికి, సప్లయ్ చైన్లో పెట్టుబడులకు, ఎక్కువ-విలువైన ఉద్యోగాలను సృష్టించడానికి దోహదపడతాయని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వ్యూహాత్మక, పోటీతత్వ అంతరిక్ష తయారీ కేంద్రంగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు.
దీనితో పాటు, టాటా అండ్ ఎయిర్బస్లు గుజరాత్లోని వడోదరలో C295 విమానాల అసెంబ్లీ లైన్ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. గుజరాత్ ఇటీవల సెమీకండక్టర్ ప్లాంట్, C295 విమానాల తయారీ సహా అంతర్జాతీయ డైమండ్ బోర్స్ వంటి ఎన్నో పెద్ద పెట్టుబడి ప్రాజెక్టులను అందుకుంది. ఈ కారణంగానే, కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు ప్రాధాన్యత ఇస్తోందని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications