Dividend Income: చాలా మంది ఇన్వెస్టర్లు ఎక్కువగా డివిడెండ్ ఆదాయాన్ని ఇచ్చే షేర్లలో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగిస్తుంటారు. ఇలాంటి క్వాలిటి షేర్లలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా కేవలం ఆదాయంతో పాటు క్యాపిటల్ అప్రీసియేషన్ లభిస్తుంది. అయితే ఈ క్రమంలో చాలా మంది వందల్లోనో లేక వేలల్లోనో డివిడెండ్ రూపంలో రిటర్స్న్ పొందుతుంటారు. మహా అయితే లక్షల్లో ఆదాయం ఉండవచ్చు. కానీ కొంత మంది విషయంలో ఈ డివిడెండ్ ఆదాయం ఏకంగా వేల కోట్ల రూపాయలుగా ఉందనే విషయం వినగానే గుండె ఆగిపోతుంది. కానీ ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం.
AceEquity ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత, హిందుస్థాన్ జింక్ల ప్రమోటర్ గ్రూపులు అత్యధిక డివిడెండ్ ఆదాయాన్ని పొందాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వరంగ కంపెనీలైన ONGC, కోల్ ఇండియా నిలిచాయి. ఈ రెండు కంపెనీలు భారత ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. గడచిన 12 నెలల కాలంలో దేశంలోని 5 కంపెనీల ప్రమోటర్లకు మాత్రం డివిడెండ్ ఆదాయం వేల కోట్ల రూపంలో వెళ్లింది. పైగా ఆ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా మంచి స్థాయిలో ఉందని తెలుస్తోంది.

ముందుగా దేశంలోని రెండవ అత్యంత విలువైన కంపెనీ అయిన TCS.. గడచిన 12 నెలల కాలంలో ఒక్కో షేరుకు రూ.113 డివిడెండ్ చెల్లించింది. ఈ కంపెనీలో 72.3 శాతం ఈక్విటీ వాటాలను టాటా సన్స్ కలిగి ఉంది. దీంతో వారికి సుమారుగా డివిడెండ్ రూపంలో రూ.29,900 కోట్లను పొందారు. దీని తర్వాత మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ కంపెనీ వేదాంత గడచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.101.5 డివిడెండ్ చెల్లించింది. దీంతో కంపెనీలో 69.69 శాతం ఈక్విటీ వాలాలను కలిగి ఉన్న బిలియనీర్ ప్రమోటర్ డివిడెండ్ రూపంలో రూ.26,000 కోట్లను అందుకున్నారు.

ఇక హిందుస్తాన్ జింక్ 12 నెలల కాలంలో ఒక్కో షేరుపై దాదాపు రూ.75.50 డివిడెండ్ చెల్లించింది. దీంతో ప్రమోటర్లు కంపెనీ నుంచి డివిడెండ్ రూపంలో రూ.20,700 కోట్లను పొందారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ONGC గడచిన ఏడాదిలో ఒక్కో షేరుపై రూ.14 డివిడెండ్ చెల్లించింది. దీంతో కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.10,300 కోట్లు డివిడెండ్ ఆదాయం అందింది. చివరిగా పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉన్న కోల్ ఇండియా సైతం మంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించింది. గడచిన 12 నెలల కాలంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.23.25 డివిడెండ్ చెల్లించింది. దీంతో కంపెనీలో 66.1 శాతం వాటాను కలిగి ఉన్న ప్రభుత్వానికి రూ.9,475 కోట్లు డివిడెండ్ ఆదాయం వచ్చి పడింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications