Vodafone Idea Shares: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో టెలికాం కంపెనీల హవా కొనసాగింది. ప్రధానంగా ఎయిర్ టెల్ కంపెనీ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచిన వేళ వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లు కూడా లాభపడ్డాయి. ఇదే క్రమంలో చాలా కాలంగా మార్కెట్లో కొనసాగటానికి ఇబ్బందులు పడుతున్న విఐ స్టాక్ బంగారు భవిష్యత్తును చూడనున్నట్లు తెలుస్తోంది.
టెలికాం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా షేర్లలో నేడు భారీ పెరుగుదల కనిపించింది. వారం చివరి ట్రేడింగ్ రోజున దాదాపు 3 శాతం పెరిగింది. అయితే ఎన్ఎస్ఈలో విఐ స్టాక్ రూ.8 వద్ద ట్రేడింగ్ ముగించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు నవంబర్ 22న రూ.6.60 స్థాయికి దిగజారిన తర్వాత ప్రస్తుతం తిరిగి పుంజుకోవటానికి పెద్ద కారణం ఉంది. వొడాఫోన్ ఐడియా తన 4G, 5G నెట్వర్క్ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ.. దేశవ్యాప్తంగా కవరేజీని విస్తరించే పనిలో ఉంది. ఈ క్రమంలో కంపెనీ రానున్న 3 ఏళ్లలో రూ.50,000-రూ.55,000 కోట్లు మూలధన వ్యయం కోసం వెచ్చించనున్నట్లు ప్రకటించటంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మద్దతు చూపారు.

వొడఫోన్ ఐడియా 2025 ఆర్థిక సంవత్సరం మెుదటి అర్థభాగంలో రూ.2,000 కోట్లకు పైగా క్యాపెక్స్ వ్యయం కోసం వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని ప్రధానంగా కంపెనీ 4జీ కవరేజీని మెరుగుపరచటం కోసం వినియోగించటంతో డేటా సామర్థ్యం 14 శాతం పెరిగింది. ఈ క్రమంలో కొత్తగా కంపెనీ 2.2 కోట్ల మంతి కస్టమర్లను పొందింది. అలాగే ఆర్థిక సంవత్సరం రెండవ అర్థభాగంలో నెట్వర్క్ విస్తరణ, సేవలను మెరుగుపరచటానికి రూ.8,000 కోట్లను వెచ్చించాలని మెగా ప్లాన్ కలిగి ఉంది. రానున్న కాలంలో కంపెనీ తన మెుబైల్ టారిఫ్ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు ఈ ఏడాది జూలైలో కంపెనీ తన టారిఫ్ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలో మెుబైల్ టారిఫ్ రేట్ల కంటే తక్కువగా ఉన్నందున టెలికాం ఆపరేటర్లు క్రమంగా రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఇది భవిష్యత్తులో కంపెనీలకు ఆదాయాల స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబరుతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అప్పుల భారంతో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా నష్టం రూ.7,175.9 కోట్లుగా నమోదైంది. అయితే గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం రూ.8,746.6 కోట్ల కంటే తక్కువగా ఉండగటం ఊరటను కలిగించే అంశం.
బ్రోకరేజీల అభిప్రాయం..
టెలికాం దిగ్గజానికి ప్రభుత్వ మద్దతు ఉందని బ్రోకరేజ్ సంస్థ తన నోట్స్లో పేర్కొంది. వొడాఫోన్ ఐడియా తన బ్యాడ్ ఫేజ్ను వదిలిపెట్టిందని బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది. మీడియం నుంచి లాంగ్ టర్మ్లో రూ.15 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ బ్రోకరేజ్ నోమురా ఇండియా గతంలో కంపెనీ షేర్లకు అందించిన 'న్యూట్రల్' రేటింగ్కి వ్యతిరేకంగా స్టాక్పై 'BUY' రేటింగ్ అందించింది. రానున్న కాలంలో కంపెనీ షేర్ల ధరలు రూ.15 స్థాయికి చేరుకోవచ్చని టార్గెట్ ధరను ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications