రిలయన్స్, బ్యాంకులు లాభాలు తెచ్చాయి! ఆ ప్రభుత్వాల ఎఫెక్ట్.. పీవీఆర్, రెస్టారెంట్ అదుర్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 28) భారీ లాభాల్లో ముగిశాయి. గత గురువారం వరకు వరుసగా ఆరు సెషన్లలో 2,750 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ శుక్రవారం 800 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ రోజు ఆ లాభాలను కొనసాగిస్తూ, దాదాపు 600 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్ 592.97 పాయింట్లు (1.59%) లాభపడి 37,981.63 వద్ద, నిఫ్టీ 177.20 పాయింట్లు (1.60%) ఎగిసి 11,227.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1,888 షేర్లు లాభాల్లో, 763 షేర్లు నష్టాల్లో, 158 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ముగిసింది.
లోన్ మారటోరియంపై మరో వారం గడువు, కేంద్రం గుడ్న్యూస్ చెప్పేనా
బ్యాంకింగ్, మెటల్, ఆటో అదుర్స్
- అన్ని రంగాలు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో సూచీలు 3 శాతం చొప్పున లాభపడ్డాయి.
- బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 2 శాతం మేర ఎగిశాయి.
- టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు (7.82), బజాజ్ ఫైనాన్స్ (6.25), యాక్సిస్ బ్యాంకు (5.83), పవర్ గ్రిడ్ కార్పోరేషన్ (4.60), టాటా మోటార్స్ (4.40) ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో HUL (-0.76), విప్రో (-0.75), నెస్ట్లే (-0.11), ఇన్ఫోసిస్ (-0.10) ఉన్నాయి.
- నిఫ్టీ 4 సెషన్ల అనంతరం 11,200 దాటింది.
- మిడ్ క్యాప్ 494 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 683 పాయింట్లు ఎగిసింది.
- 46 నిఫ్టీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. టాప్ 5 గెయినర్స్లో రెండు బ్యాంకింగ్ రంగం నుండి ఉన్నాయి.
మార్కెట్ లాభాలకు కారణాలు..
- అంతర్జాతీయ మార్కెట్ల భారీ లాభాల్లో ఉండటంతో ఈ ప్రభావం ఆసియా, దేశీయ మార్కెట్పై పడింది.
- అమెరికా ప్యాకేజీపై దాదాపు క్లారిటీ రావడంతో అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇది మన మార్కెట్లపై ప్రభావం చూపింది.
- రిలయన్స్ (0.74 శాతం), యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ వంటి ఫ్రంట్ లైన్ సూచీలు సెన్సెక్స్ భారీ లాభాలకు కారణమయ్యాయి.
- 78 పాయింట్లతో ఫైనాన్షియల్ స్టాక్స్ నిప్టీకి భారీ లాభాలు తెచ్చాయి. ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, HDFC ఉన్నాయి.
- లోన్ మారటోరియం వడ్డీ రేటు మాఫీకి సంబంధించి ప్రభుత్వం సుప్రీం కోర్టును మరింత సమయం కోరింది. దీంతో నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ అన్నీ లాభాల్లో ముగిశాయి.
- వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడానికి అనుమతించింది. దీంతో పీవీఆర్, ఐనోక్స్ లీజర్ స్టాక్స్ పుంజుకున్నాయి. పీవీఆర్ షేర్లు 12 శాతం దూసుకెళ్లాయి.
- మహారాష్ట్ర ప్రభుత్వం డైన్-ఇన్ సర్వీస్లకు అనుమతి ఇవ్వడంతో స్పెషాలిటీ రెస్టారెంట్స్ స్టాక్స్ 10 శాతం మేర ఎగిశాయి.
- హార్లే డేవిడ్సన్తో చర్చల నేపథ్యంలో హీరో మోటో కార్ప్ 3 శాతం లాభపడింది.
- ఆటో సేల్స్ క్రమంగా పుంజుకోవడంతో ఆటో రంగం కూడా పుంజుకుంది. టాటా మోటార్స్, ఎస్కార్ట్ లాభపడ్డాయి.
- ఆటో రికవరీ నేపథ్యంలో టైర్ల కంపెనీల షేర్లు కూడా పుంజుకున్నాయి. అపోలో టైర్స్, బాల్క్రిష్ణ ఇండస్ట్రీస్ 7 శాతం చొప్పున లాభపడ్డాయి.
బలహీనపడిన రూపాయి
డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు క్షీణించి 73.78 వద్ద క్లోజ్ అయింది. ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లుకు మొగ్గు చూపారు. ఉదయం రూపాయి 73.67 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 73.61 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 73.53-73.85. మధ్య ట్రేడ్ అయింది.