For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి 5జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

|

అక్టోబరు 1న ప్రగతి మైదాన్‌లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ శనివారం ట్వీట్ చేసింది. జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కూడా 5G సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

కొత్త శిఖరాలకు

కొత్త శిఖరాలకు

"భారతదేశం డిజిటల్ పరివర్తన & కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ, గౌరవనీయులైన PM, @narendramodi, భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు; ఇండియా మొబైల్ కాంగ్రెస్; ఆసియాలో అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్," అని ట్విట్టర్ లో పేర్కొంది.

అశ్విని వైష్ణవ్

అశ్విని వైష్ణవ్

అక్టోబర్ నాటికి భారత్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండు లేదా మూడు సంవత్సరాలలో దేశంలోని ప్రతి ప్రాంతాని విస్తరిస్తామని తెలిపారు.

స్పెక్ట్రమ్ వేలం

స్పెక్ట్రమ్ వేలం

ఆగస్టులో 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా టెలికాం శాఖ రూ. 1.50 లక్షల కోట్ల మొత్తం బిడ్‌లను అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పాల్గొని స్పెక్ట్రమ్ దక్కించుకున్నాయి.

English summary

అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి 5జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. | Prime Minister Narendra Modi will launch 5G services on October 1.

Prime Minister Narendra Modi will inaugurate 5G services in the country at India Mobile Congress at Pragati Maidan on 1 October.
Story first published: Saturday, September 24, 2022, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X