For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol diesel prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి, హైదరాబాద్‌లో రూ.112కు

|

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఇటీవలి వరకు స్థిరంగా ఉన్న ధరలు, వరుసగా ఐదో రోజు పెరిగాయి. ఇంధన ధరలు నాలుగురోజుల పాటు 35పైసల చొప్పున పెరిగింది. నేడు(అక్టోబర్ 24, ఆదివారం) లీటర్ పెట్రోల్, డీజిల్ పైన 0.35 పైసల చొప్పున పెరిగింది. రెండేళ్లలో ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన రెండు సంవత్సరాల్లో రూ.34కు పైన, లీటర్ డీజిల్ పైన రూ.30 పెరిగింది. సెప్టెంబర్ 5, 2021 నుండి నేటి వరకు (ఆదివారం, అక్టోబర్ 24) 20వసారి పెరిగింది. ఈ రెండేళ్ల కాలంలో డొమెస్టిక్ పెట్రోల్ ధరలు 32 శాతం, డీజిల్ 46 శాతం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరిగాయి.

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF లేదా జెట్ ఫ్యూయల్) కంటే ఇప్పుడు పెట్రోల్ 35 శాతం ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌కు రూ.79,020గా ఉంది. అంటే లీటర్‌కు రూ.79కి కాస్త పైన ఉంది. కానీ లీటర్ పెట్రోల్ మాత్రం ఢిల్లీలో రూ.107 పైన ఉంది. క్రితం ఆదివారం వరకు వరుసగా నాలుగో ఆదివారం ధరలు పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59 క్రాస్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో రూ.111ని క్రాస్ చేసింది. ఈ అక్టోబర్ నెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.6 వరకు పెరిగింది.

Price of Petrol at Rs 107.59 in Delhi, Near Rs 112 in Hyderabad

దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59, లీటర్ డీజిల్ రూ.96.32గా ఉంది. తాజా సవరణ అనంతరం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.113.46గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.104.38గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.108.11, డీజిల్ రూ.99.43, చెన్నైలో పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59, బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.100.81, డీజిల్ రూ.101.84, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.111.91, డీజిల్ రూ.105.08గా ఉంది.

ఇటీవల దాదాపు ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్, తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది నెలలుగా పెరగలేదు. గత నెల నుండి పెరుగుతున్నాయి. అంతకుముందు పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు గత నెల చివరి నుండి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. గత నెల రోజులుగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా కొద్ది రోజుల క్రితం వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు అక్కడ పెరుగుతుండటంతో ఇక్కడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో చివరి నుండి పెరగడం ప్రారంభమైంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేయగా, డీజిల్ కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల్ ధర రూ.110 దాటింది. ముంబైలో రూ.113 దాటగా, హైదరాబాద్‌లో రూ.112 దాటింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటాలు అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్ మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. చమురు డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 80 డాలర్లు దాటింది. బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్ల వద్ద ఉంది. 2018 అక్టోబర్ తర్వాత ఇది గరిష్టం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మూడేళ్ల గరిష్టాన్ని తాకాయి.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ ప్రభావం పలు ఉత్పత్తులపై పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. దీంతో రవాణా భారంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు బొగ్గు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సిమెంట్, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగాలకు భారం కానుంది. ఈ భారం ప్రజలపై పడే అవకాశాలు ఉంటాయి. బొగ్గు, చమురు ధరలు గత కొన్నాళ్లుగా పెరుగుతుండటంతో ఈ ప్రభావం ద్రవ్యోల్భణం పైన మాత్రమే కాకుండా, వివిధ రంగాలపై ప్రభావం చూపనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికన్ సెక్యూరిటీస్ అనలిస్ట్స్ చెబుతున్నారు. ఉదాహరణకు సిమెంట్ కంపెనీల రవాణా ఖర్చులు 40 శాతం వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ధర పెరిగి, వినియోగదారుడికి భారమయ్యే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, తద్వారా వినియోగదారులపై భారంలేకుండా చూడాలని అనుకుంటోందని, కానీ రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్‌దీప్ సింగ్ పూరి ఇటీవల అన్నారు.

English summary

Petrol diesel prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి, హైదరాబాద్‌లో రూ.112కు | Price of Petrol at Rs 107.59 in Delhi, Near Rs 112 in Hyderabad

Price of petrol & diesel in Delhi is at Rs 107.59 per litre & Rs 96.32 per litre respectively today. Petrol & diesel prices per litre-Rs 113.46 & Rs 104.38 in Mumbai, Rs 108.11 & Rs 99.43 in Kolkata; Rs 104.52 & Rs 100.59 in Chennai respectively.
Story first published: Sunday, October 24, 2021, 7:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X