ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 8న సోషల్ మీడియా పోస్ట్లో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఎక్స్ పోస్ట్లో మూర్తిని ఎగువ సభకు నామినేట్ చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి' (మహిళా శక్తి)కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాన మంత్రి అన్నారు.
"భారత రాష్ట్రపతి సుధా మూర్తి జీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది. అది స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనం, ఇది మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని పోస్ట్ చేశారు.

తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై సుధా మూర్తి స్పందించారు. ఇది తనకు మహిళా దినోత్సవ బహుమతి అని అన్నారు. దేశం కోసం పని చేయడం కొత్త బాధ్యతను తెచ్చిందన్నారు. సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ఆమెను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. కాగా భారత రాష్ట్రపతి 12 మంది సభ్యులను కళలు, సాహిత్యం, శాస్త్రాలు, సామాజిక సేవలకు చేసిన కృషికి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేస్తారు.
సుధా మూర్తికి 2006లో భారత ప్రభుత్వం సామాజిక సేవ కోసం భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. 2023లో ఆమెకు భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. మూర్తి తన వృత్తి జీవితాన్ని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో ప్రారంభించారు. ఆమె గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కూడా సభ్యురాలుగా కూడా ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications