ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 8న సోషల్ మీడియా పోస్ట్లో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఎక్స్ పోస్ట్లో మూర్తిని ఎగువ సభకు నామినేట్ చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి' (మహిళా శక్తి)కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాన మంత్రి అన్నారు.
"భారత రాష్ట్రపతి సుధా మూర్తి జీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది. అది స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనం, ఇది మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని పోస్ట్ చేశారు.

తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై సుధా మూర్తి స్పందించారు. ఇది తనకు మహిళా దినోత్సవ బహుమతి అని అన్నారు. దేశం కోసం పని చేయడం కొత్త బాధ్యతను తెచ్చిందన్నారు. సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ఆమెను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. కాగా భారత రాష్ట్రపతి 12 మంది సభ్యులను కళలు, సాహిత్యం, శాస్త్రాలు, సామాజిక సేవలకు చేసిన కృషికి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేస్తారు.
సుధా మూర్తికి 2006లో భారత ప్రభుత్వం సామాజిక సేవ కోసం భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. 2023లో ఆమెకు భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. మూర్తి తన వృత్తి జీవితాన్ని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో ప్రారంభించారు. ఆమె గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కూడా సభ్యురాలుగా కూడా ఉన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications