AP Vs Telangana: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ వేగంగా పెట్టుబడుల ఆకర్షణ చేపడుతున్నాయి. వేల కోట్ల పెట్టుబడుల నుంచి వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వరకు తేడాలేకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
అయితే ఈ క్రమంలోనే తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తాజాగా తన 4 GW సోలార్ పీవీ టాప్కాన్ సెల్ తయారీ ఫెసిలిటీని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఏపీలోని నెల్లూరు నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్కు మార్చాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది భవనాల నిర్మాణానికి సైతం తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన దరఖాస్తులను సమర్పించింది.

కానీ ఇప్పుడు కంపెనీ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏపీలో తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇది తెలంగాణ నుంచి వ్యాపారాలు తరలిపోతున్న ధోరణిని సూచిస్తుంది. దీనికి ముందు గతంలో కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థ తన పెట్టుబడిని తెలంగాణ నుంచి తమిళనాడుకు తరళించిన సంగతి తెలిసిందే. అలాగే కేన్స్ సెమీకండక్షన్ సంస్థ కూడా తమ పెట్టుబడిని తెలంగాణ నుంచి గుజరాత్ రాష్ట్రానికి తరలించింది. ఇది తెలంగాణలో పెట్టుబడులు తగ్గిస్తున్న ధోరణిని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు కూడా రాష్ట్రాన్ని వీడటంతో ఏకంగా రూ.1,700 కోట్ల పెట్టుబడిని తెలంగాణ చేజార్చుకుందని తెలుస్తోంది.
ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ఈ తరలింపు వెనుక గల కారణాన్ని బీఎస్ఈ ఫైలింగ్స్ లో వెల్లడించింది. కంపెనీ తన సిలికాన్ ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ సౌకర్యాలను సోలార్ పీవీ సెల్ తయారీ కార్యకలాపాలతో సహ-స్థానాన్ని గుర్తించడం ద్వారా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వ్యూహాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రీమియర్ ఎనర్జీస్కు 269.71 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే కేటాయించిన 169.71 ఎకరాలు, సూత్రప్రాయంగా ఆమోదం పొందిన మరో 100 ఎకరాలు ఉన్నాయి. కొత్త స్థలంలో ప్రతిపాదిత 4 GW సోలార్ సెల్ టాప్కాన్ సౌకర్యం, 5 GW సిలికాన్ ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ కర్మాగారం ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ అధికారిక వర్గాలు సైతం ధృవీకరించాయి. కంపెనీ తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయటానికి భారీగా స్థల కేటాయింపులను అడిగిందని భారతదేశ ఎనర్జీ వ్యూహాలకు అనుగుణంగా ఈ పెట్టుబడులు జరుగుతున్నట్లు వెల్లడించబడింది. దీనికి తోడు రవాణా సౌకర్యాలు కూడా ఉండటం కలిసొస్తున్న అంశంగా వారు అభివర్ణిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications