న్యూఢిల్లీ: విమానయాన టిక్కెట్ల ధరల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి మంగళవారం తెలిపారు. విమానయాన సంస్థలు భారత్లో పోటీ పడి మరి టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నాయన్నారు. ఇదే కొనసాగితే చాలా విమానయాన సంస్థలు మూతబడతాయని హెచ్చరించారు.

వాస్తవ రేట్లు వసూలు చేయాలి
ధరలకు కళ్లెం వేసే ఆలోచనలు ప్రభుత్వానికి లేవని హర్దీప్ పూరి చెప్పారు. మార్కెట్లో సమానత్వం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ధరల కోతే విమానయాన సంస్థల కష్టాలకు కారణమని కూడా చెప్పలేమన్నారు. కానీ ఇది కూడా ఓ కారణమని చెప్పారు. విమానయాన సంస్థలతో మాట్లాడిన తర్వాత పోటీపడి ధరలు తగ్గించడం తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వాస్తవ రేట్లను వసూలు చేయాలని తాను విమానయాన సంస్థలకు చెబుతున్నానని అన్నారు.

ఎయిరిండియా విక్రయంపై...
ఎయిర్ ఇండియా విక్రయంపై కూడా ఆయన స్పందించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను కొన్ని వారాల్లో విక్రయించనున్నట్లు చెప్పారు. ఎయిరిండియా వల్ల రోజుకు రూ.26 కోట్ల నష్టం వస్తోందన్నారు. దీనిని ప్రయివేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు. అయితే పెట్టుబడిదారుల సెంటిమెంట్ తక్కువగా ఉందని, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అప్పుల్లో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.

మహారాజా గొప్ప బ్రాండ్
ఎయిరిండియా జాతీయ సొత్తు అని, మహారాజా గొప్ప బ్రాండ్ అని, 120 విమానాలను కలిగి ఉందని హర్దీప్ పూరి చెప్పారు. ఇందులో సగం సొంతగా ఉండగా, మిగతా సగం లీజుకు నడుస్తున్నట్లు చెప్పారు. ఇది 40 నుంచి 50 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తోందని, రాబోవు కొద్ది రోజుల్లో విక్రయమవుతుందని భావిస్తున్నామని, త్వరలో ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.

ఉద్యోగులకు శుభవార్త... మూతబడదు
మార్చి నాటికి ఎయిరిండియా అమ్ముడుపోకుంటే మూతబడుతుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కూడా పూరి స్పందించారు. ఎయిరిండియా మూతబడదని ధైర్యం చెప్పారు. రియల్ ఎస్టేట్ వంటి కంపెనీలు అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎదుర్కొంటాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటోందన్నారు. అదే సమయంలో ఎయిరిండియా ఎంతకు అమ్ముడవుతుందనే ప్రభుత్వ అంచనాల గురించి ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. ఎయిరిండియాను ఓ భారతీయ సంస్థ చేజిక్కించుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications