దేశంలోని పేదలకు బ్యాంక్ ఖాతాలకు తెరిపించాలని ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రారంభించిన ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు దాటింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద, 56 శాతం బ్యాంకు ఖాతాలను మహిళలు తెరవగా, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో 67 శాతం బ్యాంకు ఖాతాలు తెరిచారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కింద 28 ఆగస్టు 2014న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బ్యాంకులు అందించిన డేటా ప్రకారం, ఆగస్టు 9, 2023 నాటికి జన్ ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది. ఈ ఖాతాదారులలో 34 కోట్ల ఖాతాలకు రూపే కార్డులు ఉచితంగా జారీ అయ్యాయి.

ఈ పథకం కింద మహిళల కోసం 56 శాతం బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో 67% బ్యాంకు ఖాతాలు తెరిచారని వివరించింది. జన్ ధన్ ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.2.03 లక్షల కోట్లకు చేరిందని పేర్కొంది. అంటే ప్రతి జన్ ధన్ ఖాతాలో సగటున రూ.4,076 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈ 50 కోట్ల మందిలో 5.5 కోట్ల మంది ఖాతాదారులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలు దేశ ఆర్థిక పరిస్థితిని మార్చడంలో పెద్ద పాత్ర పోషించినట్లు కేంద్రం వివరించింది. దేశంలోని ప్రతి వయోజనుడికి వారి బ్యాంకు ఖాతా ఉందని చెప్పింది. జన్ ధన్ ఖాతాల ఖాతాదారులకు అనేక రకాల ప్రయోజనాలు అందిస్తున్నట్లు వివరించింది. ఈ పథకం కింద ఖాతా తెరిచేవారికి కనీస ఖాతా బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఉచిత రూపే కార్డుతో పాటు, ఇది రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం ఉంటుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications