కొల్హాపురి చెప్పులపై ప్రాడా కన్ను: భారత్‌తో పార్ట్నర్షిప్ కోసం రెడీ !

ఇటలీకి చెందిన ప్రముఖ బ్రాండ్ ప్రాడా(prada) ఇబ్బందుల్లో పడింది. అసలు విషయం ఏంటంటే కొల్హాపూర్ చెప్పుల డిజైన్‌ను కంపెనీ కాపీ కొట్టిందని ఆ బ్రాండ్‌పై ఆరోపణలు వచ్చాయి. దింతో సోషల్ మీడియాలో ప్రాడాను చాలా మంది విమర్శించారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా కూడా బ్రాండ్‌ను విమర్శించారు. అన్ని వైపుల నుండి విమర్శల తర్వాత బ్రాండ్ నుండి ఒక ప్రకటన వచ్చింది . ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ప్రాడా ఇటీవలి స్ప్రింగ్ సమ్మర్ 2026 మేన్స్ వేర్ కలెక్షన్లలో భారతీయ బూట్ల నుండి ప్రేరణ పొందిన చెప్పులు ఉన్నాయని అంగీకరించింది. దీనిపై భారతదేశం నుండి చాలా ఆగ్రహం వ్యక్తమైంది ఇంకా దీనిని సాంస్కృతిక దొంగతనంగా పరిగణించారు.

Prada admits being inspired by Kolhapuri chappals says now wants to work with local Indian artisans

ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రాడా కంపెనీ తాము హస్తకళ, వారసత్వం, డిజైన్ సంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పింది. 'భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో తయారు చేసిన సాంప్రదాయ భారతీయ బూట్ల నుండి ప్రేరణ పొందిన చెప్పులను మిలన్‌లో జరిగిన 2026 మాన్సూన్ ప్రదర్శనలో చూపించారని ప్రాడా నమ్ముతుంది. బాధ్యతాయుతమైన డిజైన్ పద్ధతులకు మేము కట్టుబడి ఉన్నాము. మేము సాంస్కృతిని ప్రోత్సహిస్తాము, స్థానిక భారతీయ కళాకారుల సంఘాలతో పరస్పర చర్య కోసం చర్చలు ప్రారంభిస్తాము. వారి చేతిపనులకు సరైన గుర్తింపు లభించేలా గతంలో ఇతర కలెక్షన్స్ లో కూడా మేము ఇదే చేసాము. ఈ విషయంపై మేము మహారాష్ట్ర వాణిజ్య, పరిశ్రమ అండ్ వ్యవసాయ మండలితో సంప్రదిస్తున్నాము అని తెలిపింది.

అధికారులపై కూడా ఒత్తిడి: సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవగా, మిలన్ షో సందర్భంగా భారతీయ కళాకారులు అండ్ వారసత్వ సంపదకు క్రెడిట్ ఇవ్వలేదని అధికారుల నుండి కూడా ఒత్తిడి వచ్చింది.మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని లెదర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చర్య తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. సంత్ రోహిదాస్ లెదర్ ఇండస్ట్రీస్ అండ్ చార్మ్‌కార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (LIDCOM) చట్టపరమైన అవకాశాలను అంచనా వేస్తోంది. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ కూడా LIDCOMతో చర్చల్లో పాల్గొంటుందని మహారాష్ట్ర పరిశ్రమ కార్యదర్శి పి అన్బలగన్ అన్నారు.

"మేము కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఉన్నాము, చట్టపరమైన సహాయం ఖచ్చితంగా తీసుకోబడుతుంది. కంపెనీ ఇటలీలో ఉన్నందున ఈ పరిస్థితిలో ఉన్న చట్టపరమైన మార్గాలను మేము మూల్యాంకనం చేస్తున్నాము. అవసరమైతే, LIDCOM భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా సరైన మార్గాన్ని సంప్రదిస్తుంది" అని LIDCOM సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అన్ని వైపుల నుండి చుట్టుముట్టిన తర్వాత, ప్రాడా ఇప్పుడు భారతీయ కళాకారులతో కలిసి పనిచేయడం గురించి స్పందించింది. కొల్హాపురి చెప్పులగానే చెప్పులను తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుంటే, భారతీయ కళాకారులతో కలిసి పనిచేయవచ్చని ప్రాడా తెలిపింది. మార్కెట్‌లో చెప్పులను విక్రయించాలని నిర్ణయం తీసుకుంటే, కంపెనీ అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఇంకా సప్లయ్ చైన్ సృష్టిస్తుందని ప్రాడా గ్రూప్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఈ కలెక్షన్ డిజైన్ ప్రారంభ దశలో ఉంది, దానిని తయారు చేయాలా వద్దా అనేది నిర్ణయించలేదు.

మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు లలిత్ గాంధీ మాట్లాడుతూ, ప్రాడా ఒక టీంని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఈ టీం భారతదేశంలోని స్థానిక కళాకారులతో మాట్లాడుతుంది. 'ఈ కళాకారుల సహకారంతో ప్రాడా ఈ ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ముందు వారు మాతో మాట్లాడతారని కూడా వారు చెప్పారు' అని ఆయన అన్నారు.

GI ట్యాగ్ : కొల్హాపురి చెప్పులకు 2018 డిసెంబర్ 11న GI హోదా లభించింది. వీటిలో మహారాష్ట్రలోని 4 జిల్లాలు, కర్ణాటకలోని 4 జిల్లాలు ఉన్నాయి. చేతిపనుల పరిశ్రమ స్థాయి ఉన్నప్పటికీ, 95 మంది కళాకారులు మాత్రమే అధీకృత GI వినియోగదారులుగా రిజిస్టర్ చేసుకున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+