పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఈ అకౌంట్స్ కలిగిన వారు తప్పనిసరిగా చేయాల్సిన కనీస డిపాజిట్ గడువును మూడు నెలల పాటు పొడిగించింది. ఈ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నందున చిన్న మొత్తాల డిపాజిట్దారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
పీపీఎఫ్, ఎస్ఎస్వై ఖాతాలు యాక్టివ్గా ఉండాలంటే ఖాతాదారులు ఒక ఏడాదిలో కొంత మొత్తాన్ని కచ్చితంగా డిపాజిట్ చేయాలి. లేదంటే జరిమానా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని 80C కిందకు ఈ పథకాలు వస్తాయి. దీంతో ఆర్థిక సంవత్సరం చివరలో ఈ ఖాతాలు కలిగిన వారు డిపాజిట్ చేయాలి. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో డిపాజిట్ చేయకుంటే ఇప్పుడు జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో వీరికి ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. డిపాజిట్ చేసిన తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ.1.5 లక్షల మొత్తం మాత్రమే డిపాజిట్ చేయాలి. అంతకుమించి డిపాజిట్ చేస్తే దానికి వడ్డీ ఉండదు.

NPS ఉపసంహరణకు పీఎఫ్ఆర్డీఏ ఆమోదం
నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) సబ్స్క్రైబర్లు కరోనా సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎఫ్ఆర్డీఏ ఆమోదం లభించింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రాణాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు తెలిపింది. చందాదారులు, వారి చట్టబద్ధమైన భార్య లేదా భర్త, పిల్లలు, వారిపై ఆధారపడిన పేరెంట్స్ ఎవరికైనా కరోనా సోకితే చికిత్స వ్యయం కోసం నిధులను పాక్షికంగా తీసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications