Post Office: భారతీయులు తమ పెట్టుబడులకు అత్యంత సురక్షితంగా భావించే వాటిలో పోస్టల్ డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. ప్రభుత్వం మంచి వడ్డీ ఆదాయంతో పాటు ఎల్లప్పుడూ మంచి స్కీమ్స్ ప్రజలకోసం ప్రవేశపెడుతూనే ఉంటుంది.
పోస్టాఫీసులో చిన్న పొదుపు పథకాలు చాలా మందిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్ల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) మాత్రం పెట్టుబడిదారులకు అనేక బ్యాంక్ FDల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కింద కస్టమర్లు 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. స్కీమ్ కింద కస్టమర్లు తమ పెట్టుబడిని కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు. ఖాతాదారులు డిపాజిట్ చేసిన మూలధనంపై అత్యధికంగా 7.7% వడ్డీని పొందుతారు.

పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ పెట్టుబడిదారులకు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ప్రయోజనం ఉంటుంది. పన్ను చట్టాల ప్రకారం ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే పథకం కింద పెట్టుబడులపై వచ్చే వడ్డీపై ఎటువంటి TDS తీసివేయబడదు. దీనిని మీరు దేశంలోని ఏదైనా పోస్టాఫీసులో ఇందుకోసం ఖాతాను తెరవవచ్చు.
దేశంలోని ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వివిధ వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలానికి తన వినియోగదారులకు FDపై 6.50 శాతం వడ్డీని ఇస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 ఏళ్ల కాలానికి FDపై 6.50% వడ్డీని, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే కాలానికి 6.50% వడ్డీని, HDFC బ్యాంక్ సేమ్ కాలానికి 7% వడ్డీని చెల్లిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications