నెలకు రూ.1500 పెట్టుబడితో 35 లక్షలు పొందవచ్చు..!
భారతీయుల పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ముందుంటాయి. ఇందులో పెట్టుబిడ సురక్షితం కాబట్టి సామాన్య ప్రజలు పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడతారు. అయితే చాలా మందికి పోస్టాఫీస్ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలియదు. అయితే తక్కువ రిస్క్ తో కచ్చితమైన రాబడి ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ 'గ్రామ సురక్ష పథకం' ఒకటి. ఈ పథకంలో నెలకు రూ.1500 పెట్టుబడి పెట్టొచ్చు. ఈ క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పథకం మెచ్యూరిటీపై రూ. 31 నుంచి రూ.35 లక్షలు పొందుతారు.
19 నుంచి 55 సంవత్సరాలు
19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి కనీస హామీ మొత్తం 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దీనికి గరిష్ట బీమా మొత్తం 10 లక్షల రూపాయలు. ప్రీమియం చెల్లింపులను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వాయిదాలలో చేయవచ్చు. ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.
రుణం
మీరు ఈ పథకంలో రుణం కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మీరు దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. కానీ మీరు మెచ్యూరిటీకి ముందే పథకాన్ని రద్దు చేస్తే, మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడని అనుకుంటే. మెచ్యూరిటీ 55 లేదా, 58 లేదా 60 వరకు ఉంటుంది. అంటే మనం పెట్టుబడి పెట్టేటప్పుడే మెచ్యూరిటీని నిర్ణయించుకోవచ్చు.
రూ. 34.60 లక్షల ప్రయోజనం
అతను 55 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం రూ. 1515 అవుతుంది. మీరు 58 సంవత్సరాల పాటు పాలసీని కొనుగోలు చేస్తే, నెలవారీ ప్రీమియం రూ. 1463 అవుతుంది. 60 ఏళ్ల పాటు పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం రూ.1411 అవుతుంది అటువంటి సందర్భంలో, పాలసీదారులు 55 ఏళ్ల పాలసీకి రూ. 31.60 లక్షలు, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు, 60 ఏళ్ల పాలసీకి రూ. 34.60 లక్షల ప్రయోజనం పొందుతారు. అయితే మీ వయస్సు పెరిగితే ప్రీమియం చెల్లింపు కూడా పెరుగుతుంది.