ముంబై: కరోనా మహమ్మారి తర్వాత భారత్కు మంచి అవకాశాలు ఉంటాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మున్ముందు భారత్కు ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతుందన్నారు. వాటిని భారత్ ఒడిసిపట్టాలని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. 2020వ దశకం ఇక భారత్దే అని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరు గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డేటా ధరలు అందుబాటులో ఉండేలా..
కొత్త ప్రపంచంలో డేటా, బ్యాండ్ విడ్త్పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్ అన్నారు. ప్రతి గ్రామానికి సరిపడా బ్యాండ్ విడ్త్, అందుబాటులో ధరలో డేటా అందేలా చూడాలన్నారు. పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం కొనసాగాలన్నారు. ఈ బంధాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ను సిద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. సమాచార గోప్యత, సమాచార స్థానికీకరణ, సైబర్ పన్నుల విషయంలో ప్రభుత్వ పటిష్ట నియంత్రణ ప్రమాణాలు రూపొందించాలన్నారు.

2020 దశాబ్దం భారత్దే
2020 దశాబ్దం భారత్కు చెందినదని గ్రహించాలన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పారు. కరోనా తర్వాత కొత్త ప్రపంచంలోకి భారత్ను సిద్ధం చేయాలన్నారు. భారత్కు విపరీతమైన, అపరిమితమైన అవకాశాలు ఉంటాయన్నారు. విద్యుత్ కొరత, రవాణా, నైపుణ్యం కలిగిన కార్మికులు, భారీ వడ్డీ రేట్ల వంటి సమస్యలు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నామన్నారు.

అవకాశాలపై దృష్టి
అన్నింటిని అధిగమించి ఇకపై కొత్త ప్రపంచంలో రాబోతున్న అవకాశాలను దక్కించుకోువడంపై దృష్టి సారించాలని చంద్రశేఖరన్ అన్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్, కృత్రిమమేధ వంటి కొత్త సాంకేతికతలు ఉత్పత్తి రంగంలో కీలకం కానున్నాయన్నారు. భారత్లో పుష్కలంగా ఉన్న మానవ వనరులు అంతర్జాతీయ సరఫరా గొలుసును అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడతాయన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications