donations: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెడుతుంటాయి. అంత డబ్బు వాటికి ఎక్కడిది అంటే విరాళాల రూపంలో ఫండ్స్ వచ్చాయని చెబుతుంటాయి. కానీ వాటిని ఎవరు పంపించారు అనే విషయం మాత్రం ఎప్పటికీ ఒక సీక్రెట్టే. నల్లధనం తరహా అక్రమ సంపాదన వ్యవస్థలోకి చొరబడటం పెరిగిపోతోందని.. ఆర్థిక, సామాజిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అయితే తాజాగా విడుదలైన ఓ నివేదిక.. పరిస్థితి తీవ్రతను మరింత పెంచడం చర్చనీయాంశం అయింది.

65 శాతం గుర్తు తెలియనివే
రాజకీయ పార్టీలకు వచ్చిన నిధుల విషయమై ఎన్నికల పర్యవేక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2021-22 లో జాతీయ పార్టీలకు మొత్తంగా రూ.2,172.23 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. మొత్తం రూ.3,289.34 కోట్ల విరాళాల్లో 65 శాతం గుర్తు తెలియని సోర్సెస్ ద్వారా జమ అయినట్లు ప్రకటించింది. అందులోనూ ఎలక్షన్ బాండ్స్ ద్వారా రూ.1,811.94 లేదా 83.414 శాతం జమైనట్లు తెలిపింది. 8 పార్టీల మొత్తం డొనేషన్లలో సగం కంటే ఎక్కువగా ఈ మార్గాల ద్వారానే వచ్చినట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల కమిషన్ నివేదికల ఆధారంగానే..
రూ.20 వేల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన వారి పేర్లను ఎన్నికల కమిషన్(EC)కు రాజకీయ పార్టీలు నివేదిస్తుంటాయి. వీరిని తెలిసిన సోర్సెస్ గా పరిగణిస్తారు. మెంబర్షిప్ ఫీజులు, పార్టీ ఆస్తుల అమ్మకం, బ్యాంకు డిపాడిట్లపై వడ్డీలు, పుస్తకాలు తరహా పబ్లికేషన్ల అమ్మకాలు, పాత వార్తా పేపర్ల అమ్మకం ద్వారా సమకూరిన నిధులను.. ఆయా పార్టీలు నిర్వహిస్తున్న అకౌంట్ పుస్తకాల్లో నోట్ చేస్తాయి. ఆయా జాతీయ పార్టీలు ECకి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ పరిశోధన నిర్వహించినట్లు ADR తెలిపింది.

నివేదికలోని పార్టీలివీ..
ఈ నివేదికలో భారతీయ జనతా పార్టీ(BJP) సహా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC), ఆలిండియా తృణమూలు కాంగ్రెస్(AITC), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPIM), నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP), బహుజన సమాజ్ పార్టీ(BSP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI), నేషనల్ పీపుల్స్ పార్టీలను ADR పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

సింహభాగం భాజపాదే
2021-22లో రూ.1,161 కోట్లు గుర్తుతెలియని మార్గాల ద్వారా విరాళాలు వచ్చినట్లు భారతీయ జనతా పార్టీ ECకి నివేదించింది. ఈ విధంగా జమైన నిధుల పరంగా చూస్తే.. అన్ని జాతీయ పార్టీల్లోనూ భాజపాదే అగ్రస్థానం కావడం విశేషం. మొత్తం ఈ తరహా నిధులు రూ.2,172.23 కోట్లలో కమలం పార్టీనే 53.45 శాతం సమీకరించింది. మిగిలిన పార్టీల సగటుతో పోల్చినా BJP భాగం దాదాపు రూ.160 కోట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. గుర్తుతెలియని మార్గాలద్వారా విరాళాలు రూ.389 కోట్లుగా ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించింది.

ఏడేళ్ల నుంచీ కోర్టు పరిశీలనలోనే..
ఎలక్షన్ బాండ్లను నిర్వహించే ఏకైక సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావడం విశేషం. ఏటా 4 సార్లు వీటిని SBI రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే అందులో పాల్గొనే వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచబడతాయి. ఈ మేరకు చట్టం అనుమతిస్తోంది. ఈ బాండ్ల ద్వారా పార్టీలకు వస్తున్న విరాళాల విషయంలో పారదర్శకత లేనందున.. ఈ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ ADR సహా పలు సంస్థలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే 2015 నుంచి ఇప్పటివరకు ఆయా పిటిషన్లు కోర్టు పరిశీలనలోనే మగ్గుతున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications