Cyber Scam: సైబర్ స్కామ్స్ ప్రస్తుతం సామాన్యులను సైతం తాకుతూ ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. టచ్ మెుబైల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మోసగాళ్లకు ప్రజల డబ్బు కొల్లగొట్టడం చాలా సులభతరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం మోసగాళ్లు ఏకంగా పోలీసులను సైతం టార్గెట్ చేస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఆన్లైన్ మోసగాళ్లు ప్రస్తుతం ప్రజల నుంచి డబ్బును దోపిడీ చేయడానికి హానికరమైన లింక్లను ఉపయోగించడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి మోసాలపై మీడియా, సైబర్ నిపుణులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఆర్థికంగా భారీ నష్టాలను చూస్తున్నారు. తాజాగా పుణైకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సైబర్ మోసానికి గురై ఏకంగా రూ.2.3 లక్షలు కోల్పోయారు. వాస్తవానికి పూణే సమీపంలోని శాశ్వత్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ ఒక బేకరీలో కేక్ కొని డబ్బు చెల్లించటానికి ప్రయత్నించినప్పుడు మోసం జరిగింది.

లావాదేవీని పూర్తి చేయడానికి కానిస్టేబుల్ QRని స్కాన్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత తన సేవింగ్స్ ఖాతా నుంచి రూ.18,755 డెబిట్ అయినట్లు గమనించారు. అనధికార లావాదేవీతో అప్రమత్తమైన వ్యక్తి తన ఇతర బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా శాలరీ అకౌంట్లో రూ.12,250 డెబిట్ చేసినట్లు గుర్తించారు. ఖాతాలో ఉన్న డబ్బు మెుత్తం మాయం కావటంతో ఒక్కసారిగా పోలీసు కానిస్టేబుల్ ఆందోళనకు గురయ్యాడు. దీని తర్వాత కానిస్టేబుల్ గోల్డ్ లోన్ ఖాతాలో రూ.1.9 లక్షలకు "వన్ టైమ్ పాస్వర్డ్" కూడా అందుకున్నాడు. అయితే ఓటీపీ వివరాలను ఎవరితోనూ పంచుకోకపోయినప్పటికీ లావాదేవీ విజయవంతం కావటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ మెుత్తం సదరు బాధిత పోలీసు అకౌంట్ నుంచి విత్ డ్రా చేయబడ్డాయని గమనించాడు.
అయితే మోసగాళ్లు సదరు పోలీసుకు సంబంధించిన ఇతర క్రెడిట్ కార్డుల నుంచి కూడా డబ్బును తస్కరించేందుకు ప్రయత్నించినట్లు తేలింది. రెండు లావాదేవీల ద్వారా రూ.14,000 ఖర్చు చేసేందుకు మోసగాళ్లు ప్రయత్నించినట్లు గుర్తించబడింది. ఈ క్రమంలో వరుస దాడులతో వెంటనే అప్రమత్తమైన సదరు కానిస్టేబుల్ వెంటనే తన బ్యాంక్ ఖాతాలను, క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయటంతో నష్టం కొంత తగ్గింది. అయితే తనకు తెలియకుండానే, తనకు ఎలాంటి ప్రమేయం లేకుండానే మోసగాళ్లు డబ్బు తస్కరించటంపై సదరు పోలీసు అధికారి వెంటనే ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. మోసగాళ్లు కానిస్టేబుల్ మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలను హానికరమైన APK ఫైల్ ద్వారా యాక్సెస్ చేయడంతో బాధితుడు కూడా డబ్బును కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మోసగాళ్లు పంపిన దురుద్దేశపూర్వక లింక్ను కానిస్టేబుల్కు తెలియకుండానే క్లిక్ చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఏపీకే ఫైలా లేక క్యూఆర్ కోడ్ ద్వారా మోసానికి పాల్పడ్డారా అనే వివిధ కోణాల్లో సైబర్ పోలీసులు ప్రస్తుతం దీనిని దర్యాప్తు చేస్తున్నారు. డిజిటలైజేషన్ కారణంగా ప్రజలు యూపీఐ చెల్లింపులను విస్తృతంగా వినియోగిస్తున్న వేళ మోసాలు పెరిగిపోవటంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications