మీరు కూడా నెలకు కనీస బ్యాలెన్స్ ఉండకపోతే బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది అని భయపడే వారిలో మీరు ఒకరా? అయితే మీకు మంచి వార్త! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇకపై కనీస బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ పెనాల్టీ చార్జీలు విధించదని ప్రకటించింది. దీని ద్వారా లక్షలాది ఖాతాదారులకు ఆర్థిక ఊరట కలుగనుంది. ముఖ్యంగా చిన్న ఆదాయ గలవారికి, రైతులకు, మహిళలకు ఇది ఓ మంచి అభివృద్ధి అని బ్యాంక్ తెలిపింది. జూలై 1, 2025 నుంచి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. అంటే ఇకపై ఖాతాలో ఎంత ఉన్నా మీ మీద చార్జీలు పడవు. ఇది ఖాతాదారులకు ఒక నిజమైన రిలీఫ్ అనే చెప్పవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2025 జూలై 1వ తేదీ నుంచి, కనీస నిల్వ (Minimum Average Balance) ఉంచకపోతే విధించే పెనాల్టీ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ సేవలను అందరికీ చేరవేయడం, అలాగే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
కనీస నిల్వ ఛార్జీలు అంటే ఏమిటి?
కనీస నిల్వ ఛార్జీలు(MAB) అనేది ఖాతాదారులు నెల లేదా త్రైమాసిక సమయాన తమ ఖాతాలో కలిగి ఉండాల్సిన కనీస సగటు నిల్వ. ఇది బ్యాంకుల వ్యయాలను సమర్థంగా నిర్వహించేందుకు విధించేది. కనీస నిల్వ ఛార్జీలు ఉంచలేకపోతే గతంలో బ్యాంకులు రూ. 100 నుంచి రూ. 600 వరకు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి.
PNBలో ఇప్పటివరకు ఉండే చార్జీలు ఎలా ఉండేవి?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఇప్పటివరకు సేవింగ్స్ ఖాతాదారులపై విధించిన కనీస సగటు నిల్వ (MAB) చార్జీలు ఖాతా విధానాన్ని బట్టి వేరేవేరుగా ఉండేవి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఖాతాదారులు నెలకు కనీసం రూ. 500 నుంచి రూ. 1,000 వరకు బ్యాలెన్స్ ఉంచాల్సి ఉండేది. ఇలా చేయకపోతే రూ. 200 నుంచి రూ. 400 వరకు పెనాల్టీ చార్జీ వసూలు చేసేవారు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఖాతాదారులకు మాత్రం కనీస బ్యాలెన్స్ రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు ఉండాల్సి ఉండేది. అలా డబ్బుని నిల్వ ఉంచుకొకపోతే రూ. 300 నుంచి రూ. 600 వరకు పెనాల్టీ విధించబడే అవకాశముండేది. ఈ చార్జీలను ప్రతి నెలా ఖాతాదారుల ఖాతాలో నుండే ఆటోమేటిక్గా డెబిట్ చేసేవారు. ఇప్పుడు ఈ పెనాల్టీలన్నీ పూర్తిగా తొలగించ బడటం ఖాతాదారులకు మేలు కలిగించనుంది.
ఈ మార్పుతో ఏమి లాభం?
పంజాబ్ నేషనల్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం, తక్కువ ఆదాయ గలవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చిన్న ఉద్యోగులు, రైతులు, పింఛనుదారులు, గృహిణులు వంటి వారు ఖాతాలో కనీసం బ్యాలెన్స్ ఉంచాలన్న ఒత్తిడి ఇకపై ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, బ్యాంకింగ్ చేర్పు (Financial Inclusion) దిశగా ఇది ఒక మంచి ముందడుగు అని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఇకపై ఖాతాలు ప్రారంభించి, ఖర్చుల భయం లేకుండా అవి నిర్వహించుకోవచ్చు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు వంటి వారు నెలవారీ నిల్వలు నిర్వహించలేని పరిస్థితుల్లో కూడా ఎలాంటి భయం లేకుండా ఖాతాను కొనసాగించవచ్చు. ఇలా చూస్తే, ఈ మార్పు సామాన్యులకు ఆర్థిక స్వేచ్ఛను అందించడమే కాక, సమర్థవంతమైన బ్యాంకింగ్ వినియోగాన్ని కూడా ప్రోత్సహించనుంది.
ఈ బ్యాంకు ప్రస్తుతం కనీస బ్యాలెన్స్ జరిమానా మాత్రమే రద్దు చేయబడింది. ఇతర ఛార్జీలు (SMS అలర్ట్స్, ATM ఛార్జీలు, చెక్బుక్ ఛార్జీలు మొదలైనవి) మామూలుగా కొనసాగుతాయి. వాటిలో ఏ మార్పు లేదు అని గమనించ గలగాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మాత్రమే కాకుండా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కనీస బ్యాలెన్స్ జరిమానా రద్దు చేశాయి. కెనరా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్న మొదటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకు ఇది 2025 జూన్ 1 నుండి రెగ్యులర్, శాలరీ, NRI ఖాతాలతో సహా అన్ని కేటగిరీల పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ జరిమానా పూర్తిగా మాఫీ చేసింది.
PNB బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం, ఖాతాదారులకు ఆర్థిక భద్రతను కలిగించడమే కాక, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ చేరువ కావడానికి కూడా దోహదపడుతుంది. ఇకపై మీ ఖాతాలో ఎంత ఉన్నా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications