మొండి బకాయిలపై పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) కీలక ప్రకటన చేసింది. వచ్చే మార్చి నాటికి రూ.16వేల కోట్ల రికవరీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు తెలుగువాడైన మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మల్లికార్జునరావు అన్నారు.
గ్రామాల్లో ఉన్న వారికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ప్రారంభించిన సంపర్క్ అభియాన్(GSA) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రికవరీ చేయనున్న రుణాల్లో రూ.8వేల కోట్లు ఎన్సీఎల్టీ కింద ఉన్న కేసులను పరిష్కరించడం ద్వారా, మరో రూ.8వేల కోట్లు ఇతర బకాయిలను వసూలు చేయనున్నట్లు తెలిపారు.

లాభాల్లోకి బ్యాంకు
గతంలో నీరవ్ మోడీ, తాజాగా సింటెక్స్ వంటి కార్పోరేట్ డిఫాల్ట్లు వెలుగు చూశాయి. దీనికి కరోనా-లాక్ డౌన్ వంటి సమస్యలు తోడయ్యాయి. లోన్ మారటోరియం మరో ఇబ్బందిగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను PNB ఎదుర్కొంటోంది. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పనితీరుని మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకును లాభాల్లోకి తీసుకు వచ్చి, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నాటికి రూ.308 కోట్ల నికర లాభాలు నమోదు చేశామన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తామన్నారు.

నిరర్థక ఆస్తులు పెరగకపోవచ్చు
మొండి బకాయిలపై స్పందిస్తూ.. రూ.8,000 కోట్లు ఎన్సీఎల్టీ ద్వారా వసూలు కావొచ్చునని, మరో రూ.8,000 కోట్లు ఇతర మార్గాల్లో వసూలు చేసుకుంటామని చెప్పారు. దాదాపు రూ.93వేల కోట్లు వసూలు కావాల్సి ఉన్నప్పటికీ 652 రాని బాకీల ఖాతాలను ఎన్సీఎల్టీ బెంచీలకు నివేదించినట్లు తెలిపింది. ఇందులో 93 శాతం మొత్తాలు పూర్తి సెక్యూర్డ్ రుణాలు అన్నారు. బకాయిల రికవరీలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నామన్నారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి మొత్తం రూ.4 లక్షల కోట్ల బకాయిలు దివాలా రిజల్యూషన్ ప్రక్రియలో ఉండగా, అందులో రూ.1,96,000 కోట్లు రికవరీ అయ్యాయన్నారు. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 శాతం నుండి 3 శాతం కంటే పెరగకపోవచ్చునన్నారు.

విలీన ప్రక్రియపై...
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం తర్వాత PNB 11,000 శాఖలు, 13,000 ఏటీఎం నెట్ వర్క్తో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. మార్చి నాటికి విలీన ప్రక్రియ సంపూర్ణం అవుతుందని చెప్పారు. PNBకి తెలంగాణలో 141 శాఖలు, ఆంధ్రప్రదేశ్లో 132 శాఖలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది రూ.37వేల కోట్ల వ్యాపారం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వ్యాపారవృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరిస్తామన్నారు. విలీనం తర్వాత PNB వ్యాపారం రూ.18 లక్షల కోట్లకు చేరుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో PNB ఖాతాదారుల వద్దకు వెళ్లి వారి బ్యాంకింగ్ అవసరాలు తీర్చే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మల్లికార్జున రావు తెలిపారు. ఇందుకు విలేజ్ కాంటాక్ట్ ప్రోగ్రాంను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 25,000 గ్రామాలకు PNB సిబ్బంది వెళ్తారన్నారు. నగర ప్రాంతాల్లో కార్పోరేట్ కస్టమర్లను కలిసి వారి అవసరాల ఏ మేరకు తీర్చగలమో పరిశీలిస్తామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications