భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రూ.2000 నోట్లను రద్దు చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు రూ.200 నోటును కూడా రద్దు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. మన దేశంలో 2000 నోట్లను చలామణి నుంచి తొలగించాక అదే తరహాలో రూ.200 నోట్లను కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందా ? అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా క్లారిటీ ఇచ్చింది. నిజంగానే మోడీ ప్రభుత్వం రూ.200 నోట్లను రద్దు చేస్తున్నారా ? దీనిపై ఆర్బీఐ ఏం చెప్పింది? భారతదేశంలో అత్యధికంగా చెలామణి అవుతున్న నోట్లు 500 రూపాయలు అలాగే 200 రూపాయలు. దాదాపు ప్రతి ఒక్కరి జేబులో 200 రూపాయల నోటు ఉంటుంది. అయితే మోడీ ప్రభుత్వం ఈ నోటును రద్దు చేస్తుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక సమాచారం ఇచ్చింది. ఏంటంటే రూ.2000 నోట్ల రద్దు తర్వాత దేశంలో రూ.200, రూ.500 నకిలీ నోట్లు నిరంతరం పెరుగుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఏదైనా లావాదేవీల సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు హెచ్చరిక మెసేజ్ జారీ చేసింది.

అసలు నోటును ఎలా గుర్తించాలి?
నోటుకు ఎడమవైపు దేవనాగరి లిపిలో రూ.200, మధ్యలో మహాత్మాగాంధీ, ఆర్బీఐ, భారత్, ఇండియా, 200 అనే చిన్న అక్షరాలతో స్పష్టమైన ఫోటో ఇంకా కుడివైపు అశోక స్తంభం గుర్తు ఉంటుంది.
నకిలీ నోట్ల పై ఆర్బీఐ సూచనలు
నకిలీ నోట్లను గుర్తించడంలో అలాగే నిరోధించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ఏదైనా డబ్బు లావాదేవీల సమయంలో నోట్లను సరిగ్గా సరిచూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎవరికైనా నకిలీ నోటు వస్తే వెంటనే స్థానిక అధికారులకు లేదా సంబంధిత బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 200 నోటును రద్దు చేసే ఉద్దేశం కూడా లేదని ఆర్బీఐ తెలిపింది.
500 నోటు అసలు లేదా నకిలీని గుర్తించడం ఎలా?
ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నా నకిలీ నోట్ల దందా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 500 రూపాయల నోట్ల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. 500 రూపాయల నోటు నిజమైనదా లేదా నకిలీదా అని గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అసలైన 500 రూపాయల నోటు 66mm x 159mm సైజులో ఉంటుంది. '500' అనే సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది. వాటర్మార్క్లో మహాత్మా గాంధీ ఫోటో ఇంకా '500' అని ఉంటుంది. నోటు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో కనిపిస్తుంది. ఇందులో 'భారత్' అలాగే 'ఆర్బిఐ' అని చిన్న అక్షరాలతో ముద్రించిన సంవత్సరం ఎడమవైపు, అశోక స్తంభం చిహ్నం కుడి వైపున ఉంటాయి.
నకిలీ నోట్ల పట్ల జాగ్రత్త
నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఇప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నకిలీ నోట్లను గుర్తించడానికి మార్గదర్శకాలను కూడా అందిస్తుంది. దీన్ని అనుసరించడం ప్రజలకు చాలా సహాయపడుతుంది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications