Rozgar Mela: వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా నియమితులైన సుమారు 70 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లను అధికారులు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచమంతా భాగస్వాములయ్యేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం దేశం రాజకీయ సుస్థిరతతో నిర్ణయాత్మక ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని మోదీ తెలిపారు. దేశ ప్రగతి, ఆర్థిక మరియు సామాజిక నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునే అవకాశం లభించినట్లు వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ కాల్ ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్న ప్రధాని.. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారనుందన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారికి ఇది చాలా ముఖ్యమైన క్షణమని గుర్తుచేశారు.

ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలపై ప్రధాని మాట్లాడారు. ముద్రా పథకం, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలను వినియోగించుకుంటూ.. యువత ఉద్యోగాలు సృష్టిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. SSC, UPSC మరియు RRB వంటి సంస్థలు కూడా రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళంగా, పారదర్శకంగా నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నాయన్నారు.
ఆర్థిక మాంద్యం, కొవిడ్ మహమ్మారి, కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా గొలుసులో అంతరాయం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రధాని గుర్తు చేశారు. వాటన్నిటికీ అతీతంగా భారత్ తన ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తోందని అభినందించారు.
దేశంలో MNC కంపెనీల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. దేశ GDPలో 6.5 శాతానికి పైగా దోహదపడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఇందుకు ఉదాహరణగా చూపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications