Vishwakarma Yojana: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశంలోని ప్రజలందరినీ ఉద్ధేశించి ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేశారు. ఈ క్రమంలో దేశ ప్రజల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
వెనుకబడిన కులాలకు(OBC) అండగా నిలిచేందుకు విశ్వకర్మ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికింద ప్రజలకు రూ.13,000-15,000 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంగలి, చర్మకారులు, కమ్మరి వంటి OBC కమ్యూనిటీకి చెందిన కార్మికులకు సహాయం చేయడానికి ఈ స్కీమ్ ఉద్ధేశించబడింది. సాంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల్లో ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతిని పెంచే లక్ష్యంతో వచ్చే నెల విశ్వకర్మ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించనున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. అయితే 140 కోట్ల భారతీయుల కృషితో దేశం వేగంగా వృద్ధి చెందుతూ ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకుందని ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజల కృషితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు.
అవినీతికి తావులేకుండా లీకేజీలను ఆపామని తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించగలిగామని ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ భారత ప్రజలను "నా తోటి పౌరులు" అని సంబోధించకుండా ప్రధాని మోడీ బుధవారం దేశాన్ని తన "కుటుంబ సభ్యులు" అని అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications