అమెరికాలో ప్రధాని మోడీ: 36 గంటలు ప్లాన్ ఇదే.. కీలక అంశాలపై చర్చ..

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 10వ తేదీన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశం ప్రారంభమైన సంగతి మీకు తెల్సిందే. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కూడా మాట్లాడారు అలాగే సమావేశం తర్వాత భారతదేశం అండ్ ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం, రెండు దేశాలు AI పరిశోధన అండ్ అప్లికేషన్‌లో సహకారాన్ని పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగిసాక బుధవారం (ఫిబ్రవరి 12) అమెరికాకు చేరుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వీరిద్దరూ తొలిసారి కలుసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై ట్రంప్ సుంకాలను పెంచుతూనే ఉన్నందున ఈ సమావేశం చాలా కీలకంగా పరిగణించబడుతుంది. అమెరికాకు మోడీ చేరుకున్నాక అమెరికన్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ వైట్ హౌస్ సమీపంలోని అధ్యక్ష అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌లో బస చేస్తారు.

PM Modi america Visit From Stay At Blair House To trump Meetings In 36 Hours here A Full Itinerary

వాషింగ్టన్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "భారతదేశం-అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను కృషి చేస్తాను" అని అన్నారు. అంతేకాకుండా దీని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. తన 36 గంటల పర్యటనలో మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక అంశాలపై చర్చించనున్నారు.

ప్రధాని మోదీ 36 గంటల అమెరికా పర్యటన ప్రణాళికలు: ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వివిధ ద్వైపాక్షిక అంశాలు చర్చించబడే అవకాశం ఉంది. చైనా, రాడికల్ ఇస్లాం ముఖ్యమైన ముప్పులుగా పరిగనిస్తూ ఈ ఇద్దరు నాయకులు కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చిస్తారు.

ఈ పర్యటన విజయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధం కీలక పాత్ర పోషించనుంది. 2019 నుండి 2020లో ఒకరి దేశాలకు ఒకరు చేసిన పర్యటనల సందర్భంగా ఇద్దరు నాయకులు లోతైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. 2019లో హూస్టన్‌లో జరిగిన "హౌడీ మోడీ" కార్యక్రమం అలాగే 2020లో ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన ఈ సంబంధానికి నిదర్శనాలు. ఇద్దరు నాయకులు బలమైన నాయకత్వం ఇంకా ఆర్థిక జాతీయ వాదానికి ప్రసిద్ధి.

47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపు ఆయనను కలిసిన నాల్గవ దేశాధినేత ప్రధాని మోదీ అవుతారు. అంతకుముందు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మొదట అమెరికాకు ప్రయాణించారు, ఆ తర్వాత జపాన్‌కు చెందిన షిగేరు ఇషిబా వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II మంగళవారం అమెరికాకు వెళ్లారు. భారతదేశం-అమెరికా సంబంధాలలో వాణిజ్యం, భద్రతా సహకారం, ఇంధనం కీలకమైన దృష్టి కేంద్రాలుగా ఉద్భవించిన సమయంలో మోడీ-ట్రంప్ సమావేశం జరగడం గమనార్హం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+