ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 19వ విడతను విడుదల చేశారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విడతను విడుదల చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు రూ.22 వేల కోట్లు అందనుంది. ఇందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు.
అలాగే మోడీ భాగల్పూర్ నుండి మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. దీనికోసం ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల జారీ చేస్తారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతుంది.

6 సంవత్సరాలు పూర్తి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి నేటితో 6 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీనిని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతులను అభినందించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు చేరాయని అన్నారు. దీని గురించి మోడీ సోషల్ మీడియా అకౌంట్ Xలో కూడా సమాచారం పోస్ట్ చేసారు. సోమవారం ఉదయం మోడీ ఇన్స్టాగ్రామ్లో 'పీఎం-కిసాన్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దేశవ్యాప్తంగా ఉన్న మన రైతు సోదరులు, సోదరీమణులకు అభినందనలు. ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల కోట్లు వారి ఖాతాలకు చేరడం నాకు చాలా సంతృప్తిగా ఇంకా గర్వకారణం. మా ఈ ప్రయత్నం రైతులకు గౌరవం, శ్రేయస్సు అలాగే కొత్త బలాన్ని ఇస్తోంది అని అన్నారు.
ఈ పథకం ఏమిటి?
ఈ పథకం కేంద్ర పథకం. దీని కింద, అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 ఇస్తారు. ఈ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. రైతులు ఈ మొత్తాన్ని వివిధ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా రైతులకు వారి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది. అంతేకాదు అధిక నాణ్యత గల విత్తనాలను కూడా కొనుగోలు చేయవచ్చు. రైతులు ఈ మొత్తం నుండి ఎరువులు మొదలైనవి కూడా కొనవచ్చు. కిసాన్ సమ్మాన్ యోజన ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకం.
ఈ పథకానికి షరతులు
ప్రతి రైతు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రయోజనం పొందలేరు. దీని కోసం కొన్ని అర్హత నియమాలు ఉండటం అవసరం. అతి పెద్ద నియమం ఏమిటంటే రైతుకి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అంటే రైతులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పథకం లబ్ది పొందలేరు. అలాగే, రైతు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించకూడదు. రైతు కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఒక్కరికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించిన కేంద్ర రంగ పథకం. ఈ పథకం ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications