కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలలో ఒకటైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డిసెంబర్ 2018లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం కింద రైతులకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) ఒక నివేదికను సమర్పించింది. ఇందులో రైతుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఆర్థిక సహాయం పెంచాలని సూచించింది. ICRIER నివేదిక కూడా PM కిసాన్ యోజన (PM-KISAN) కింద మొత్తాన్ని పెంచాలని కోరింది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 మాత్రమే ఇస్తున్నట్లు ఐసీఆర్ఐఈఆర్ నివేదిక పేర్కొంది. అయితే వస్తువుల ద్రవ్యోల్బణం చాలా రెట్లు పెరిగింది. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు ఆర్థిక సహాయం కనీసం రూ.10,000 ఉండాలని పేర్కొంది.

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిన్న రైతులు ఉన్నారు. వారికి 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. మరోవైపు పెద్ద రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాణిజ్య విధానాల వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోందని నివేదిక అభిప్రాయపడింది. ఈ కారణంగా, ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సహాయం మొత్తాన్ని పెంచాలని వివరించింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 10 వేల కోట్లను ఆదా చేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ జాబితా నుంచి అనర్హులను తొలగించారు. దీంతో భూమిలేని రైతులు, టైదార్లు, కౌలు రైతులను కూడా చేర్చాలనే డిమాండ్ పెరిగింది. ఈ పథకం కింద ఎలాంటి మార్పులకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడికాకపోవడం గమనార్హం. నవంబర్ లేదా డిసెంబర్ 2023 మధ్య పీఎం కిసాన్ యోజన 15వ విడతను ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.


Click it and Unblock the Notifications