దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan) పథకంలో భాగంగా 22వ విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. సాగు ఖర్చుల కోసం పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఈ రూ. 2,000 కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు అసోం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ. 18,640 కోట్లు జమ కానున్నాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రైతులకు రూ. 49,000 కోట్లకు పైగా అందించారు. విశేషమేమిటంటే, ఈ విడతలో దాదాపు 2.15 కోట్ల మంది మహిళా రైతులు కూడా లబ్ధి పొందనున్నారు.
లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి
మీకు ఈ రూ. 2,000 వస్తాయో లేదో తెలుసుకోవడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే గ్రామవారీగా ఉన్న లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా PM Kisan అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in సందర్శించండి.
- హోమ్పేజీలో ఉన్న 'Beneficiary List' అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, మండలం (Tehsil) ఎంచుకోండి.
- ఆ తర్వాత మీ బ్లాక్ , గ్రామం పేరును సెలెక్ట్ చేయండి.
- చివరగా 'Get Report' బటన్పై క్లిక్ చేయగానే మీ ఊరి లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉంటే తప్పకుండా మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.
ఈ నిధులు ఎవరికి అందవు?
కొంతమంది రైతులకు ఈసారి రూ. 2,000 వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం కింది కారణాల వల్ల డబ్బులు ఆగిపోవచ్చు..
- ఈ-కేవైసీ (e-KYC): ఎవరైతే ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయలేదో లేదా ఆధార్ను అప్డేట్ చేయలేదో వారికి డబ్బులు పడవు.
- ప్రభుత్వ ఉద్యోగం: రైతు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా లేదా ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నా ఈ పథకం వర్తించదు.
- కుటుంబ నిబంధన: ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ లబ్ధిదారులుగా నమోదైతే ఒకరికే నిధులు అందుతాయి.
- పెన్షన్: నెలకు రూ. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
- రైతులు తమ వివరాలను సరిచూసుకుని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే పోర్టల్లో సరిచేసుకోవడం ఉత్తమం.
మొత్తంగా చూస్తే.. ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి రైతులు తమ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నంబర్ మెసేజ్లను చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మెసేజ్ రాకపోతే, మీ దగ్గరలోని బ్యాంక్ లేదా ఏటీఎంకు వెళ్లి స్టేట్మెంట్ చూడవచ్చు. ఈ పథకం ద్వారా అందుతున్న నగదును రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు లేదా ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు పడకపోతే, వెంటనే PM Kisan హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించడం మంచిది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications